Jump to content

పుట:Neti-Kalapu-Kavitvam.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

177

(రూపహార్యుడుకాని పినాకపాణిని పార్వతి పతిగా కోరుతున్నది)

అని రూప ప్రేమ యొక్క హేయత్వాన్ని వ్యక్తంచేస్తాడు

ధర్మసంబంధంగాని అధర్మ సంభంధంగాని యేమీ లేకుండా తినడం కనడం పరమప్రవృత్తిగా పెట్టుకున్న సాధారణుల శృంగారం సయితం అగ్రాహ్యమే అవుతున్నది. వీరులు సత్యవాదులు దయావంతులు పరదారవిముఖులు లోకానికి అపేక్ష్యులుగాని తినడం కనడం పరమవృత్తిగా, పెట్టుకున్న పశుతుల్యులు అపేక్ష్యులుగారు. యేదో విధంగా స్వార్ధాన్ని అణచి లోకశ్రేయస్సుకు ధర్మంకొరకు త్యాగం జూపగలిగినప్పుడే ధర్మరక్షకత్వం ధర్మ పరత్వం సిద్ధిస్తున్నవి. ధర్మం అనంతముఖాలతో వెలసివున్నదని యిదివరకే చెప్పినాను. అదిగాక ప్రాకృతుల్లో ఆశృంగారం ఆధారంగా కులకడం, కలియడం, తహతహపడడం ఇట్లాటివి మాత్రమే బయటబడతవి. ప్రాకృతులు నాయకులుగావున్న యెంకిపాటలు మొదలైనవీస్థితినే తెలుపుతున్నవి.,

"కామాతురాణాం న భయం నలజ్జా"
అన్నట్లు యెంకిపాటల్లో నాయుడు బావ
"పదిమందిలో యెంకిపాటనే పాడంగ"

అని తనకాంతను గురించిన పాటను లజ్జవిడిచి పదిమందిలో పాడేకేవల కామి;యింతేకాదు. ఇతడు పరకాంతతో వరసలాడే వెకిలిమనిషి.

"పొరుగమ్మతో నేను వరసలాడేవేళ"

అని అంటాడు. యితడు సంస్కారహీనుడైన ప్రాకృతుడని యింకా ముందునిర్ణయిస్తాను. ఈకోటిలోనివారు గనుకనే యీ యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట మొదలైనవాట్లో

"కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది."