పుట:Neti-Kalapu-Kavitvam.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


కనుకనే

"పరస్య న పరస్యేతి మమేతి న మమేతి చ.
 తదాస్వాదే విభావాదేః పరిచ్ఛేదో న విద్యతే (సాహి)


ఇది పరుడికి సంబంధించినది. ఇది పరుడికి సంబంధించినదిగాదు. ఇది నాకు సంబంధించినది. ఇది నాకు సంబంధించినది కాదు. అని కావ్యంలో విభావాదుల పరిచ్ఛేదమే వుండదు.

"సాధారణ్యేన రత్యాదిరపి తద్వత్ ప్రతీయతే" (సాహి)
   
"రత్యాదులు సాధారణ్యభావనవల్ల ప్రతీతమవుతున్నవి." అని సాహిత్యదర్పణకారుడన్నాడు. కనుక విభావాదులకు దుష్టాదుష్టత్వం మేమొప్పుకోము. ఆ విచారణే సాహిత్యంలో అసంబద్ధం. అది ధర్మ శాస్త్రంలో చేస్తే చేయండి అని అంటారా?

సిద్ధాంతం



వినిపిస్తున్నాను; మధువు ఆస్వాదితమయ్యేటప్పుడు తద్భావన తప్ప ఇది గిన్నె. ఈగిన్నె వెడల్పింత. దీన్ని యీలోహంతో చేశారు అనే విచారణ వుండదు. మధుమాధుర్యమే ఆనిమిషంలో మనో వ్యాప్తమై వుంటుంది. అని తెల్పడం యెట్లాటిదో రసాస్వాదనసమయంలో విభావాదులపరిచ్చేదం వుండదనడం అట్లాటిది. మధువు తియ్యగావున్నా దాన్ని కుష్ఠి పులినీళ్ల చేతితో తాకి విషలిప్తమైన గిన్నెలో బోశాడు అని తెలిసినప్పుడుగూడా, మధ్వాస్వాదనసమయంలో మధుమాధుర్య భావనతప్ప మరేమి వుండదనేమాటల ప్రేరణవల్ల అకుష్ఠి స్పృశించి విషపుగిన్నెలో పోసిన మధువును తాగము. మధువు మధురమవునుగాక దాన్ని ఆస్వాదించేటప్పుడు అన్యవిచారణవుండకపోవుటనుగాక కాని దాని వుపాదిదుష్టమని తెలిసినప్పుడు తప్పక అది అగ్రాహ్యమే అవుతున్నది. తెలియక అట్లాటిదుష్టశృంగారకావ్యం పఠిస్తామా? మనఃకాలుష్యం మొదలైన నాంతరీయకఫలాలు తప్పక సిద్ధిస్తున్నవి. ఇంతకూ