పుట:Neti-Kalapu-Kavitvam.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


  ఆలింగితాయాం పునరాయతాక్ష్యాం
  ఆశాస్మహే విగ్రహయో రభేదం

1. వక్షస్సు మీదవాలి కొప్పు జారగా ముకుళితనయనలై కొద్దిగా ఉన్మీలితలై ఉపరిసురతంచేత చెమర్చిన గండస్థలాలతో వుండే వధువుల పెదవితేనెను భాగ్యవంతులు తాగుతారు.

2.పాపహారి అయిన గంగవారియందైనా వాసంచెయ్యి లేదా? మనోహరి. హారి అయిన తరుణీస్త నద్వయమందైనా వాసం చెయ్యి

3. మాత్సర్యంవదలి కార్యం విచారించి మర్యాదతో ఆర్యులారా! ఈ సంగతి చెప్పండి భూధరాల నితంబాలు సేవ్యమా? స్మరస్మేరవిలాసినుల నితంబాలు సేవ్యమా?

4. ప్రణయమధురం అనురాగరమ్యం రసాశ్రయం ఫణితి మధురం. సౌకుమార్య భరితం ప్రకాశితసమ్మదం స్వలావరుచిరం విస్రంభార్ధం స్మరోదయప్రదం అయిన మృగీనేత్రల స్వైరాలాపాలు యేకాంతంలో అనిర్వాచ్యంగా మనస్సును హరిస్తవి.

5. చూడనంతసేపు చూస్తే చాలునని వుంటుంది. చూసిన తర్వాత కౌగిలించుకొని సుఖ మనుభవించవలె నని వుంటుంది. ఆయతాక్షి కౌగిలిలోకి రాగానే విగ్రహాల అభేదాన్ని అపేక్షిస్తాము.

అని యిట్లా భర్తృహరి ప్రతిపాదించిన శృంగారమనోహరత్వం ఇంకా వివరించవలసిన పనిలేదు.