పుట:Neti-Kalapu-Kavitvam.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


నా కనేకవిధముల సహాయసంపత్తి నొసగుచున్న ప్రాణమిత్రులగు బసవరాజు వెంకటప్పారావు, దువ్వూరిసాంబమూర్తి, యేడిద సూర్యనారాయణగార్లకు శతహస్రవందన కుసుమార్పణములకన్న నేనేమి యుపకరింపగలను."

అనిప్రకటించారు. ఈ తీరుగా వీరందరు ఈశృంగారాన్ని యెంకిపాటలను మెచ్చుకోవడమేగాకుండా భారతి పత్రికనిండా ప్రణయజానకి అని ప్రణయినీగీతాలని ప్రణయగీతాలని ప్రణయసౌధమని విరివిగా కనబడుతున్నవి. వీరిట్లా ప్రీతి జూపిన వీటితత్వమేమిటి అని వీటినన్నిటిని శ్రద్దతో పరిశీలించాను. ఇక వీటివిచారణ ఆరంభిస్తాను.

యెంకిపాటలకథ.

యెంకినినాయుడు వరిస్తాడు. ఆమె మొట్టమొదట బెట్టుచూపి తరవాత అతడికి వశమవుతుంది. రాత్రుల్లో చేలో నాయుడుంటే యెవరికీ తెలియకుండా అతడికొరకు నీటుగా వస్తుంది. మంచెకింద గోనెపట్ట వేసుకొని యిద్దరు కలుస్తారు. ఆమె కులుకుచూపులు చూపిస్తుంది. తెల్లవారబొయ్యేవేళ యింటికిబోయి యేమీ యెరగన ట్లుంటుంది. కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడుతారు. తరువాత యిద్దరికి వియోగం సంభవిస్తుంది. యెంకినాయుడికోసం రాత్రులయందు యేటి వొడ్డుకుపోయి అతణ్ని తలుచుకుంటుంది. తరువాత మళ్లీ కలుస్తారు. తిరుపతికి పోతారు. మళ్లీ వియోగం. ఇద్దరూ ఒకరికోసం వొకరు తాపపడతారు. తిరిగి కలుస్తారు. కొద్దిరోజుల్లో కడుపుతో వుంటావని నాయు డంటాడు. అందుకు నాకు యినాము లియ్య మంటాడు. పుస్తకంలో కథ ముగుస్తుంది.

గాక శృంగారం అనే గ్రంథంలో ఒక్కొక్కరు కొన్ని కొన్ని పద్యాలు రచించారు." రజస్వలకాకముందే చన్నులువచ్చినవి."

"జోడుగుండ్లబారననెద దోచె గొత్తచనులు" అని.
"పొదరు గుబ్బలరైక నెగదన్ని పయ్యంట." అని.