పుట:Neti-Kalapu-Kavitvam.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


"త్రేతాద్వాపరసంధినుద్ధతమదాంధీభూతవిద్వేషిజీ,
 మూతవ్రాత " (భా-ఆ.)

భారతంలో ఆరంభించిన యతిభంగ దోషం యిట్లా నేటికీ దూరంగాక తెలుగుపద్యాన్ని వికృతంచేస్తున్నది.

పాదభంగం.

వృత్తాన్ని పదచ్ఛేదయుతమైన పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాగంగా పింగళాదు లేర్పరచడంలో, పద్యంయొక్క గతివిశేషం, అర్థప్రదత్వం. శ్రావ్యత్వం మొదలైనగుణాలు పుష్టమవుతున్నవి. కనుకనే పాదాంతయతి నియతంగా భారతీయచ్ఛందోవేత్తలు పరిగణించారు. కాని యీపాదసౌందర్యం నన్న యభారతంలోనే లుప్తమైంది.

"విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండుకృ
 ష్ణద్వైపాయను డేగుదెంచె" (స.భా)

"విద్యుద్దండము నిల్చి పొల్చినగతి న్విల్లందమైయుండ న
 స్మద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింపదృ
 ష్టద్యుమ్నుoడు." (తి. భా)

అని యిట్లా భారతంలో ఆరబ్దమైన పాదభంగం.

               
"నాదేశంబున వేరుపాతుకొనె సంఘప్రస్పుటాచారర
 క్షాదీక్షాపరతంత్రబుద్ధిలత" (జీవితాదర్శం).
"రేఖామంజుల వాసనాలహరి పర్వెన్ ప్రాతరానీతశో
 భాఖద్యోత విలాసరాగలలితప్రాంశు"
                                      (అనార్కాళి. భారతి)
 

అని యిట్లా యిప్పటికీ గోచరిస్తున్నది. పద్యాలు పాదసౌందర్య హీనమైనవి. కొన్ని పొడుగైన వొంటికాలిమనిషివలె చాంతాడువంటి