పుట:Neti-Kalapu-Kavitvam.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


కావ్యాల్లో మూడు నాలుగు అయిదుమాటలకంటె యెక్కువగా చేరిన ఈగుంపులు అరుదుగా కానవస్తవి. అయితే విభక్తిలోపంతో యెన్నిమాటలైనా చేరి యేకంగా బిగియడానికి అవకాశం వుడడంచేత

"రుధిరకుతూహలి కేసరికిశోరలిహ్యమానకఠోరధాతకీస్తబకే'

(హర్ష)


అని "సమరకండూలనిబిడభుజదండకుండలీకృతకోదండిశింజినీ
       టంకారోజ్జాగరితవైరి నగర" (సాహిత్య ఉ)

అని యిట్లా సంస్కృతగ్రంథాల్లో రచిస్తూవచ్చారు. ఇట్లాటిపదసమూహాలు తెలుగుభాషకు విరుధ్దమైనవి. సంస్కృతం తెలుగుభాషాతత్వాన్ని అనుసరించి యిమిడేటంతవరకే వుచితంగా వుంటుంది గాని తక్కినది యిమడని అసంబద్దపదార్ధంగా వుంటుందని యిదివరకే తెలిపినాను. కనుక సాధారణంగా మూడునాలుగు అంతగా అయితే అయిదు మాటలకంటె యెక్కువైన సంస్కృతశబ్దాల చేరికలు తెలుగులో యిమడక అసంబద్ధమై హేయమవుతున్నవి. ఇదే భాషావ్వతిక్రమం. ఇది భారతంలో ఆరబ్ధమైంది. దీనిని గురించి విపులంగా ప్రధమఖండలో నన్నయాధికరణంలో వివరించాను గనుక యిక్కడ విస్తరభీతిచేత వదలుతున్నాను.

ప్రథమఖండంలో వుదాహరించిన వాటినుండి కొన్ని ఉదాహరణాల నిక్కడ చూపుతున్నాను.

"హరిహరా జగజానననార్క షడాస్యమాతృసరస్వతీ
 గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి" (భా. స. ఆ)

"ఘోరసం, సారవికారసంతమస జాలవిజృంభముబాపి" (భా. న. ఆ)

"మనో హర సుచరిత్ర పావనపయః పరిపూర్ణములైన"

(భా. న.ఆ)



"మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం