పుట:Neti-Kalapu-Kavitvam.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఆక్షేపం

అవునయ్యా యిట్లాటిదోషాలెన్ని వున్నా ఇప్పటి కాలపుకవిత్వం విలక్షణమైనది. వెనుకటికవులు ఆశ్వాసాలని సర్గలని కావ్యవస్తువును విభజించి పెద్ద పెద్ద కవ్యాలువ్రాసేవారు. ఇప్పటికవులు భావమే ప్రధానంగా చిన్న చిన్న కవ్యాలు వ్రాస్తున్నారు. ఇవి యింగిలీషు లిరిక్సు (Lyrics) నుబట్టి వ్రాసినవి. వీటిలో భావోద్రేకం ప్రభావం ఇవి వెనక మనకు లేవు. ఇప్పటికవుల చినకవ్యా లీలిరిక్కులకు చేరినవి. ఇదే భావకవిత్వం. ఇది కొత్త ఈకొత్తయే ఒకగొప్పగుణం. దోషాలన్నీ దీంట్లో అణగిపోతవి అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను, అది అసంభద్ధపుమాట భావకావ్యాలు మనకు చిరకాలంనుండివున్నవి. యెకభావాన్ని ప్రధానంగా ప్రతిపాదించే చిన్న కావ్యాలు మన వాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. ఈ సంగతి విశదపరచడానికి ముందు ఈ కాలపు కావ్యాల్లో వున్న భాషావ్యతికంచ్చందో వ్యతిక్రమాలను గురించి కొంతవిశదం చేస్తాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దృష్టివిచారాధికరణం సమాప్తం.