పుట:Neti-Kalapu-Kavitvam.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దవాచ్యతాధికరణం

97

ఇట్లానే "పుంస్కోకిలోయ మ్మధురం చుకూజ" (కుమార) అని అన్నాడు.

ఇట్లా యెక్కణ్నైనా యీ మాటలు వుంటే రోతలేదు. కాని యిప్పటికృతులనేకాల్లో మధురలు, కోమలలు, దివ్యలు, ఆనందలు, మంజులలు. ముసిరి మూగి వెగటు పుట్టిస్తున్నవి ఈ కాలపు కృతికర్తలనేకుల కీ జౌచిత్యజ్ఞానం కనబడదు. పద్యం మొదలు పెట్టితే దివ్యలు, మధురలు, ఆనందులు మంజులలు ప్రణయలు, కోమలాలు వేస్తున్నారు.

"నీవు తరుణ మాధవుడవు నేను కోకిలను"

అని అన్నప్పుడు మధుమాసంలో కోకిల పంచమస్వరవిరావి అవుతుందని ప్రసిద్ధమే గనుక చక్కగా పాడుతాననే అర్ధం విదితమవుతుంది. తరుణమాధవుడవు అనడంతోనే మధుమాసశోభపూర్ణంగా గోచరిస్తున్నది. కాని కృష్ణపక్షకర్త యీ అభిప్రాయం తెలపడానికే

"తరుణ శృంగార మధురమాధవుడ నీవు
 కలికిపాటల కోయిలకులము మాది"

అని ఆరంభంలో శబ్దవాచ్యత పాలైనాడు.

ఇతడు మధురంగా పాడేదీ, పాడనిది యితడిపద్యాలే చెప్పవలసి వున్నవి. శృంగార, మధుర కలికిపాటలు, అని శబ్దవాచ్యతే గాకుండా పులుముడు దోషం గూడా చేశడు. ఇట్లాటివి కృష్ణపక్షం నిండా వున్నవి. ఈ కాలపుకృతులనేకాల్లో యీదోషం అధికంగా వున్నది.

"విశ్వమోహన రసపుంజ మృదులగీతి
 చారుసిత శీతచంద్రికాపూరమైన
 శారద మనోజ్ఞ యామినీ సమయమందు"

(భారతి సం.2. సం.2 పేజీ 108)