పుట:Neti-Kalapu-Kavitvam.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

వాఙ్మయ పరిశిష్టభాష్యం నేటికాలపుకవిత్వం


"ఈక్షోణిన్ నినుబోలు సత్కవులు లేరీనేటి కాలంబులో
 ద్రాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
 వక్షోజద్వయ గంధసారఘుసృణ ద్వైరాజ్యభారంబున
 ధ్యక్షించున్ గవిసార్వభౌమభవదీయ ప్రౌఢ సాహిత్యముల్" (కాశీ.)

అని చెప్పినట్లు వ్రాశాడు.

భవభూతి

   "చేతస్తోషకరీ శిరోనతకరీ విద్యానవద్యాస్తి నః"

అని అన్నాడు అట్లానే మృదుత్వాన్ని మాధుర్యాన్ని వ్యక్తపరుస్తూ మధురం దివ్యం మంజులం అంటే మంచిదేను; అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: శక్తిమంతుడేదో సందర్భం వచ్చినప్పుడు ఇతరులు తూలనాడినప్పుడు, భవభూతివలె జగన్నాథుడివలె ఒకసారి రెండుసార్లు చెప్పుకుంటే రోతలేదు. కాని నిజంగా శక్తిమంతుడైనా మాటి మాటికి పుటపుటకూ నేను గొప్పవాణ్ని అని వాపోతుంటే రోతగానే వుంటుంది అసలింతకూ బూతవర్తమానాల్లో అద్వితీయుడైన కాళిదాసు

"మందః కవియశఃప్రార్ధీ గమిష్యామ్యపహాస్యతామ్"

అని వినతుడైనాడు ఒకరకపు మనుషులు జగన్నాథుడివంటివాండ్లు బయటపడి వెళ్లబెట్టుకుంటే ఒకటి రెండుసార్లకు రోతగా వుండదు. కాని పుటపుటకూ వాపోతే రోత అని సహృదయుల కందరికీ తెలిసిన సంగతే ఇట్లానే కవి తన మాధుర్య ప్రేమను మంజులత్వ ప్రేమను త్రెలియబరచడానికి ఆసందర్భాలు మధురమైనవని వ్యక్తం జేయడానికీ కొన్ని మధురలు, కొన్ని దివ్యలు వేస్తే రోత పుట్టదు. కాళిదాసు తపోవనాల పావనత్వం మీది అభినివేశం ఆపలేక

"పునానం పచనోద్ధూతైః" (రఘు)

అని పావనత్వాన్ని శబ్దంతో చెప్పినాడు.