పుట:Neti-Kalapu-Kavitvam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

శబ్ద వాచ్యతాధికరణం

శబ్దవాచ్యత

ఈకాలపుకృతుల్లో శబ్దవాచ్యత అధికంగా, వెగటుగా, కనబడుతున్నది. శబ్దవాచ్యత అంటే యేమోవివరిస్తాను. ఒకడు తెలివిగలవాడు శక్తిమంతుడు అయితే అవి అతని కృత్యాలవల్ల, వివేకం తెలిపే మాటల వల్ల లోకానికి వ్యక్తమవుతుంది. కాని, నేను తెలివి గలవాడను. గొప్పవాడను అని చెప్పుకొన్నంతమాత్రాన గాడు.

"బ్రువతే హి ఫలేన సాధవో నతు వాక్యేన నిజోపయోగితాం". |(నైష)

అని శ్రీహర్షు డీసత్యాన్నే తెలుపుతున్నాడు చెప్పుకొన్న మాత్రాన అతడు గొప్పవాడూ, తెలివిగలవాడూ అని లోకం అనుకోకపోగా అతడు రోతమనిషి అని అసహ్యపడుతుంది. ఇట్లా చెప్పుకొనడమే శబ్దవాచ్యత. కవి సయితం సృష్టివల్ల ప్రకృతి చేష్టాసంభాషణాదులవల్ల వ్యక్తమయ్యే భావపరంపర చేత తన కావ్యమాధుర్యాన్ని ఆనందాన్ని లోకానికి ప్రసాదించవలెగాని ఊరికె మధురం, దివ్యం, మంజులం, కోమలం అని చెప్పడంవల్లగాదు అది శబ్దవాచ్యత అయి రోత పుట్టుతుంది. ఈ కాలపుకృతికర్తల్లో అనేకుల కివివేకం లేనట్లు కనబడుతున్నది. మాతృమందిరమనే నవలలోదివ్య మధుర ఆనంద అనే మాటలు పుస్తకమంతటా నిండివున్నవి.

యేకాంతసేవలో మటుకు ఇందాక నేను పులుముడుకు ఉదాహరించిన

"మధుర మోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ