పుట:Neti-Kalapu-Kavitvam.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులుముడుఘటనాధికరణం

91


ఈధొరణే యేకాంతసేవలోను ఇంకా ఈకాలపు అనేకకృతుల్లోను కనబడుతున్నది.

"ప్రేమాలయంబులో ప్రియు డాడువేళ
 ప్రేమడోలికలలో ప్రియు డూగువేళ
 ప్రేమామృతాబ్ధిలో ప్రియుడీదువేళ (యేకాంతసేవ)

యేమితోచకపోతే 'పాడిందేపాటరా' అనికొంతసేపు మాటలు దండగబెట్టే పద్యకర్తల ధోరని యిది. కృష్ణక్షంలోని

"చిత్తమానంద మయ మరీచికలసోల
 హృదయ మానంద భంగమాలికలదేల
 కనుల నానందజనితాశ్రుకణములూర".

అనే పంక్తుల ధోరణిగూడా అదే

విస్తరదోషంకింద నేను ప్రస్తావించిన కూచి నరసింహకృత వనవాసిలోని పాత్రల ఉపన్యాసాలు. రామరాజులోని పటాను అంత్యోపన్యాసం బళ్ళారి కృష్ణమాచార్యుల సారంగధరాదుల్లో అదికప్రసంగాలు అన్నీ పులుముడే అయివున్నవి.

ఉత్తమకావ్యాలు సయితం నన్నయ ఆరంభించిన పద్యాల్లోకి దిగేటప్పటికి పులుముడు పాలై చెడిపోయినవి. ఈ సంగతి ప్రథమఖండంలో మీమాంసచేశాను. గనుక యిక్కడ వదలుతున్నాను అమేయమై. అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశం కల్పిస్తూ భావప్రపంచాన్ని ప్రసాదించే ఉత్తమకావ్యరచన అనేక కారణాలచేత లుప్తమయిపోయి వాచ్యరచనమాత్రం మనకు నేటికాలాన మిగిలింది.

ఈవాచ్యదశను దాటిని కృతు లీకాలపువి మిక్కిలి అరుదుగా నాకు కనబడుతున్నవి పులమడానికి ఉదాహరణాలు చూపడమంటే కృతులను సంపూర్ణంగా ఉదాహరించడమే అవుతుంది గనుక ఆపని