89
వాజ్మయ పరిశిష్ఠభాష్యం - నేటికాలపుకవిత్వం
వికృతక్రూరక్షుధాక్షుభిత మృత్యుకరోం
వికటపాండురశుష్కవదనేదంష్టాగ్నిలో నవ్వేలా?
అని నిదర్శనపరంపరకు ఉదాహరించిన పల్త్కులూ పులుమడే అయివున్నవ్ఫి. ఇదివరకు చూపిన "ఐక్యమౌదామె" "వియోగరాగం" "కవితాంశ" పులుముడు దోషంతో కూడివున్నవి.
"ప్రాజ్యపీఠపురీమహారాజ్యబాగ్య
లక్ష్మి కొలువుదీర్చు చిరత్న రత్నఖచిత
భాసమానకల్యాణ సింహాసనంబు
అది వెలమ శౌర్యమూర్తిరణాననీవి
హారవిక్రమ కేళికానంరమ్ము
శాంతినుండు విలాసవిశ్రామనేది
అది సభాసీనసకలబుధావతంస
ఘన్ అకేఎశానవిజ్ఞానకాంతి మత్త్ర
సన్నవీక్షణ స్నాపిత స్వర్ణపీఠి
అది మహీపతిఆమరాయానవీంద్ర
కరకమల నీజ్యమాన చామరసమీర
పులకిత భవన్మృదుభూషితంబు"
అని ప్రాజ్య బాగ్య భాసమాన, కల్యాణ, శాంతినుండు, మహీపతి అని ఇట్లాయెన్నో అనావశ్యకశబ్దాల గుప్పించిన పులుముడు కృష్ఠపక్షంనిండా వున్నది.
"శారదశర్వరీమధురచంద్రికసూర్యసుతాస్రవంతికా
దారు వినీల వీచిక ప్రశాంతనిశాపవనొర్మి మాలికా
చారితనీప?శాబ్నికకృశాంగిని గోపిక నేను" (కృష్ణపక్షం)
అని యీమాదిరి వున్నవన్నీ పులుముడే అయివున్నవి. సాధారణంగా ప్రాకృతస్త్రీలూ హీనులు పొట్లాడేటప్పుడేమీతోచక పొతే నోరువిప్పి పుట్టేదాకా అడ్డగోలుగా తిట్టుమీద తిట్టు పదితిట్లు తిట్టి వూరుకుంటారు.