పుట:Neti-Kalapu-Kavitvam.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


 
వింటి నని ఒక మొసలినవ్వుచు వీధిపఱుగులు బారెరా
మానసంబున మనుజుడొక్కడు మాను నమలుచునుండెరా
కాని కానిమ్మనుచు దోమలు కనకగిరి కదలించెరా

నిరుపమాంబుధి చంద్రమళ్లూరి వీర రాఘవదయానిధే" (కా.త) అని యిట్లా చెప్పినమాటలు నేటికి అయోమయమై సమస్యలకిందికి దేలి ఉద్దిష్టప్రయోజనానికి దూరమై వున్నవి. సర్వలోకం సంశ్రయించ దగినవిజ్ఞానాన్ని ప్రసాదించిన శంకరప్రభృతులు తమసిద్ధాంతాలను అయోమయత్వంలోకి దింపలేదు. గనుకనే దిగంతవ్యాప్తమై వున్నవి. శ్రీభాగవతకవి యీతీరుగా అన్యాపదేశంగా పురంజనోపాఖ్యానం జెప్పి చివర కది అయోమయమవుతుందని తలచి కాబోలు తానే దాన్ని విపి వినిపించాడు.

పూర్వపక్షం

.

అవునండీ, మీరది అయోమయమంటారు; ధ్యానగీతలో ప్రతిక్రియలో కృష్ణపక్షపు ప్రభంజనస్వామిలో అంతరార్థమున్నదని మేమంటాము అని వాదిస్తారా?

సమాధానం.

చెప్పుతున్నాను. ఆఅంతరార్థాన్ని ఢీకొనే అంతరార్థం నా విచారణలో కూడా వున్నదంటాను. మీ రది విప్పినప్పుడు నే నిది విప్పుతానంటాను. ఈమాటలకు తలా తోకా లేదు. యేమైనా అంతరార్థం వుంటే దాన్ని యెందుకు కప్పిపెట్టవలె నని ప్రశ్నిస్తున్నాను. యేమైనావుంటే దాన్ని విప్పి చెప్పండి అని కోరుతున్నా ను. చెప్పే దాక ఆవి అయోమయమ్మాట లంటున్నాను. విప్పి చెప్పినప్పుడు అవి యెంతవరకు వుచితమో మళ్లీ ఆమాటలమీద వేరే విచారణచేస్తాను.

అస లింతకూ విప్పడానికి ఇవి సమస్యలుగావు; తిరుమలేశ