పుట:Navanadhacharitra.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxii

నవనాథ- "మహనీయ మగు ముక్తి మంటపంబులను
                 బహుపుణ్య కథలు చెప్పఁగ విన్నవారి
                 వరుసఁ జాంద్రాయణ వ్రతములు నెలలు
                 జరుపుచు మృతికి వాచఱచెడి వారు
                 శరభచర్మములవై శంఖమయూర
                 గోముఖా ఘోర కుక్కుట మత్స్య సింహ ...
                 నామ విచిత్రాసనస్థులై బడలు ... .... .....
                 పెదవు, లొక్కింత గదలంగ నుజ్వలస్ఫటిక
                 జపమాలికలు వ్రేళ్ల జరుపుచు మంత్ర
                 జపములు నిష్ఠమై జరిపెడువారు,
                 ధర్మరతులను యతులను, వ్రతులనుం బాశు
                 పతులను జూచుచు" నేగి-

ఇట్టి వర్ణనారీతియందలి భేద మాయా గ్రంథసందర్భములను బట్టి కవికిఁ గలిగిన దృష్టి భేదమును సూచించుచున్న దనవచ్చును. పై కాశీ విశ్వేశ్వరునినగరు వర్ణించినరీతియే నవనాథచరిత్రమున మల్లి కార్జునుని ప్రాసాదవర్ణనమునఁ గనబడుచున్నది.

                ధవళగోపుర చతుర్ద్వార బంధురము,
                ప్రవిమల ముత్తాతపత్రరాజితము,
                నరుణవితాన రమ్యమును సమర -
                పటు ఘంటికాముఖ్య బహువాద్య రవము
                నైన శ్రీమహ మల్లికార్జున నగరు-

నవనాథచరిత్రములోని వంచక పురోహితుని యాకారచర్యా విశేషములు చాలవఱకు హరిశ్చంద్రలోని కాలకౌశికునియందు మూర్తీభవించినవి. ఈ పురోహిత పంచాంగబ్రాహ్మణుల చర్యల నాధారముగాఁ జేసికొని గౌరనామాత్యుఁ డీ రచనలలో హాస్యరసమును జక్కగాఁ బోషించినాఁడు. ఆంధ్రకావ్యములలో హాస్యరసపోషణము చాలఁ దక్కువయనియే చెప్పవలసియున్నది. గౌరన యీ గ్రంథములఁ దనకుఁ గలిగిన యవకాశమును జక్కఁగా వినియోగించికొని యున్నాడు.

వీరి యాకారమునఁ గల సామ్యము---

నవనాథ - బలువుగప్పిన గొగ్గి పండ్లును బిట్టు
                  పడికి కంపెసఁగెడి బడబాకి నోరు