పుట:Navanadhacharitra.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxi

                    నతిసమున్నత సైకతాంచితజఘన
                    లలితశీకరహార లతికాసమేత”

హరిశ్చంద్ర - "సరససైకతసీమ జఘనంబు గాఁగ
                    సురుచిరంబగు మేటినుడి నాభి గాఁగ
                    నునుఁదీఁగనాచులే నూఁగారు గాఁగ
                    నెనయు జక్కవలు పాలిండులు గాఁగ
                    సరవిఁ బెల్లెసఁగెడు జలకణపంక్తు
                    లరుదారు మౌక్తికహారముల్ గాఁగ"

మీననాథుఁడు హిమవంతమునకుఁ బోవునపుడు మార్గమధ్యమునఁ గాశినిదర్శించుట, హరిశ్చంద్రుఁడు కాశికిఁ బోవుట యను సందర్భముల జేయఁబడిన కాశీవర్ణనమందలి సామ్యము: ---

నవనాథ- " వినుఁడు విప్రునిఁ దెగవేసినవాఁడు
                   అనిశంబు ననృతంబులాడెడివాఁడు
                   కామించి గురుపత్నిఁ గవసినవాఁడు
                   సొలవక వచ్చియిచ్చట మృతినొంది
                   కన్నువినుకలి కంకణమునుదమ్మి
                   గన్నపాపని పుఱ్ఱె కంచంబు నలఁతి..."

హరిశ్చంద్ర - "కామాక్షి, విప్రుని వధియించునతఁడు,
                    కామాంధుఁడై తల్లిఁ గవిసినయతఁడు ...
                    జంతు సముదాయమైన నిచ్చటమృతిఁబొంది,
                    మిన్నేటి జడలును మిక్కిలి కన్ను
                    పులితోలు గాసెయు పునుక కంచంబు,
                    గల యితఁడాతఁడై ... .... ..... ....."

హరిశ్చంద్రలో- “ధవళగోపుర చతుర్ద్వారబంధురము,
                      ప్రవిమల ముక్తాతపత్రసుందరము
                      నగణిత కనక కుంభాభిరామంబు,
                      నగు విశ్వనాథ మహాదేవు నగరు"

నా దేవదేవుని యానందమూర్తి మొదలగు వాని వర్ణనము సహజ రామణీయకంబు గలదై యొప్పుచున్నది. కాని నవనాథచరితమునం దచ్చట జపతపో వ్రతాదులను సల్పు యతులు, వ్రతులు, పాశుపతులు మొదలగువారి వర్ణనము శైవసంప్రదాయ ప్రాధాన్యముగల యీ గ్రంథమునకుఁ దగి సందర్భానుసారమై యున్న దనవచ్చును.