పుట:Navanadhacharitra.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

"అస్తి ప్రశస్తా వనిపాలమౌళీ రత్నావళీ రంజిత పాదపీఠః
 రేచర్ల వంశార్ణవ పూర్ణచంద్రో మహాబలస్సింగయమాధవేంద్రః
 ఆసీత్తస్య మహామాత్యః స్వామి కార్య ధురంధరః |
 మన్త్రి మి? (పో) తరాజ ఇతిఖ్యాతః రాజనీతియుగన్ధరః |

ఈతనికి పోతరాజు మంత్రిగా నుండెనని వెలుగోటివారి వంశచరిత్రములో నుదాహరింపఁబడిన "శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగై కధురంధరః | మంత్రీ(శ్రీ)పోతనామాసీత్ సర్వశాస్త్ర విశారదః!” అను శ్లోకమువలనఁ గూడఁ దెలియవచ్చుచున్నది. సర్వజ్ఞసింగ భూపాలుఁడని పేరువడసిన రావుసింగ మహీపాలు నాస్థానమునకు శ్రీనాథుఁడు పోయినట్లును, నాతఁడు మహావిద్వాంసుఁ డగుటచే నాతని మెప్పించువిషయమున నీతఁడు కొంత జంకుగలవాఁడై 'దీనారటంకాల' పద్యమును జెప్పి, రాజసభాదేవతయగు శారదాంబను స్తుతించె ననియుఁ బ్రసిద్ధి కలదు గదా! అట్టి సర్వజ్ఞుని కొడు కగు నీ సింగయ మాధవనృపాలుఁడు గూడ గొప్ప పండితుఁడేయై శాలి. శక, 1349 సంవత్సరము క్రీ. శ. 1427) న రామాయణమునకు “రాఘవీయ' మను నొక టీకను వ్రాసెనని యాతని భార్య రచింపించిన యొక శాసనమునందలి యీ క్రింది పద్యము వలన స్పష్ట మగుచున్నది:-

"శాకాఖ్యే నిధివార్ధిరామ శశిగేప్యబ్దే ప్లవంగే శుభే
 మాసేప్యాశ్వయుజే రఘూద్వహపదే యో రాఘవీయాహ్వయామ్
 టీకామర్థవటు ప్రబోధఘటనామాణిక్య పుష్పాంజలిం
 కృత్యా రాజతి రావుమాధవనృపో రామాయణస్య శ్రియే. ”

ఇట్లు శ్రీ. శ. 15-వ శతాబ్ది తొలిభాగమున నున్న సింగయమాధవ నృపాలునియొద్ద మంత్రిగా నున్న పోతరాజు ననుజుఁ డగు నయ్యలామాత్యుని కొడుకగు గౌరస 15-వ శతాబ్ది పూర్వార్ధమున నుండె ననుటకు సందేహము లేదు. మఱియు శ్రీనాథునిచే శివరాత్రిమాహాత్మ్యమును దన భృత్యుడగు ముమ్మిడి శాంతయ్యకుఁ గృతి యిప్పించిన శ్రీశైల జంగమ మఠాధీశ్వరుఁ డగు శాంతభిక్షావృత్తరాయఁడే గౌరనచే నవనాథచరిత్రమును మల్లికార్జునుపేరఁ గృతిగాఁ జెప్పించుటచేత నీ గౌరనయు శ్రీనాథుని కాలమువాఁడే యని విస్పష్టంబగుచున్నది. శివరాత్రిమాహాత్మ్యమునందు నైషధ కాశీఖండాది పూర్వ గ్రంథముల పోలికలు విశేషముగాఁ గనఁబడుచుండినను, అవతారిక దోష భూయిష్ఠమౌటను, ప్రౌఢబంధముకలదిగాఁ గనఁబడకుండుటను, శ్రీ నాథుఁడు గతించిన పిదప నవతారిక యెవ్వరిచేతనో వ్రాయించి, ముమ్మిడి శాంతయ్య యాగ్రంథమును గృతినందె నను వాదము యథార్థమగుట తటస్థించినను దీనికి బ్రేరకుఁ


ఆంధ్రకవుల చరిత్ర-పుట 595.