పుట:NagaraSarwaswam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

నేనంతవరకు నిలువజాలను. ఎడమచేతి చిటికెనవ్రేలి నడిమిరేఖ సంకేతముగాగల యీ దినముననే నా కోరిక తీర్పవలెను.

- అజయుడు

అనివ్రాసి ఆ పరిచారికకిచ్చెను. పరిచారిక యా చీటిని రాకుమారియొద్దకు గొనిపోయింది.

ఈ విధముగా తానామె ప్రశ్నలకైదింటికి తగు సమాధానములు చెప్పగలిగినందులకు వాన్ని స్తుతిస్తూ అజయుడచ్చట కూర్చుండి ఉన్నాడు. అంతలో బహుపరిచారికా సేవితయై రాకుమారి అజయుని యెదుటకు వచ్చి నమస్కరించి పరిచారిక యందిచ్చిన పూలమాల నాతని మెడయందుంచి-

స్వామీ! నాకొక సిద్ధుడీ ప్రశ్నలను-వీని సమాధానములను ఉపదేశించి-ఈ సమాధానములు చెప్పినవానిని పెండ్లాడమన్నాడు. అప్పటినుండి నేనివిధంగా అనేకులను బ్రశ్నించాను. కాని ఒక్కరును వీని మర్మము తెలిసికొని సమాధానము చెప్పజాలకపోయేరు. నేటికి నా తపము ఫలించింది. మీరిచ్చిన సమాధానాలు తగివున్నాయి. నాకు మువ్వురు చెల్లెండ్రు. వారుకూడ ముమ్మూర్తుల నన్నేపోలినవారు. మమ్ము నలువురను భార్యలుగా స్వీకరించి యీ రాజ్యాన్ని బాలించండి.- అని వినయముగా బలికింది.

అనంతరం ఆజయుడు తన సోదరులనుగూర్చి రాకుమారినడిగి తెలిసికొని వారిని విడిపించాడు. రూపంలో సౌందర్యంలో గత్నపదికనే పోలివున్న ఆమె చెల్లెండ్రను మువ్వురను తన ముగ్గురు సోదరులకు భార్యలుగా నిర్ణయించారు.

ఒకనొక శుభముహూర్తంలో గత్నపదికకు, అజయుసకు వైభవముగా వివాహము జరిగినది. అదే ముహూర్తలో రత్నపదికయొక్క చెల్లెండ్రను అజయుని సోదరులు పెండ్లాడిరి. ఆనూతన దంపతులు చిరకాలము సుఖముగా జీవించారు.

★ ★ ★