పుట:Naayakuraalu.Play.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

నాయకురాలు

మ. దే. రా : తమరే నిశ్చయించండి.

బ్రహ్మ : మండాది విశాలమయిన ఊరు. కృష్ణ అడ్డమున్నది. పశువులకు నీరూ మేతా సమృద్ధిగా దొరికే అడవులు అందికెలో వున్నవి.

లంకన్న : మన కిప్పుడు పశుధనమే ఆధారం. మండాది పశువుల పెంపుకు ఒనరయిన ఊరు. మెకాలపోడుగూడా తక్కువ. .

మ. దే. రా : మండాది పోవడం అందరికీ యిష్టమేనా ? కొ మ్మ : పోయి వుంటుంటే సాధక బాధకాలు తెలుస్తవి. వసతిగుదరకపోతే ఇంకొకవూ రవుతుంది.

బ్రహ్మ: రేపు ప్రొద్దునే ప్రయాణం. ఎల్లుండి తెల్లవారుగట్ల పల్నాటియెల్ల కట్టదాటి పోతాము.

ఆహా ఎంతమాట! మనము పల్నాటిని విడిచిపోతున్నామా ! తల్లీ పల్నాటిరాజ్యలక్ష్మీ ! ఇక యేడేండ్లు నీ నీళ్లు రుణస్య దీరినవి. పవిత్రమయిన యీ పల్నాటి పుణ్యభూమిమీద పరుండేభాగ్యం మనకు లేదు. మనకు చంద్రవంక నీళ్ళలో పర్వస్నానం ప్రాప్తం దిరీంది. పచ్చిక దుబ్బులవలె పెరిగిన యీ పల్నాటికొండలు మన కిక కనుపడవు. పల్నాటిభానుడు మనమీద అస్తమించబోతున్నాడు. తల్లీ ని న్నొకవరముమాత్రము కోరుతున్నాము. నీ ఉత్సంగములో పతనమై కండ్లు దెరిచాము. తిరిగి నీ వొళ్లోనే క్రిందికొరిగి మాగన్నుబెట్టే భాగ్యముమాత్రం మా కియ్యి. అదియే ముల్లోక రాజ్యం పెట్టు.

[ తెరపడుతుంది. ]