ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
నాయకురాలు
పందెములు జరుగబోతున్నవి. మేటిపందెగాండ్లందరూ పౌరుషముగల పుంజులనుదెచ్చి పందెములు జరిపి దేశములో పౌరుషమును పెంపొందింప గోరుతున్నాము. మానధనులయిన ప్రభువులును, సరదారులును 'కోడిపోరుకంటె గొప్పదిలేదయా' అనే ప్రమాణవాక్యమును సార్థకపరచ గోరుతున్నాము.
ఇట్లు
పల్నాటిప్రభువయిన నలగామరాజు
ఇది చాలునా?
నర : మనరాజు పల్నాటిప్రభువని సంతకముచేయడము ఎంతో సూచిస్తున్నది.
నాయ : పల్నాటికంతకు తనే ప్రభువునని అభిప్రాయము.
నర : అది కాదనేవారితో కలతకు మొద లన్నమాట.
నాయ : ఈ పందెమే అందుకాయె. సరే, ప్రకటనకు ప్రతులు తయారుచేయించి నలుదిక్కులకు పంపించు.
గు: చిత్తము.
[ వెళ్లుతాడు ]
నర : పందెమేమి బొడ్డుతారు ?
నాయ : ఓడినవారు తమ రాజ్యమును గెలిచినవారి కొప్పగించి పరదేశములకు వెళ్లిపోవడం.
నర: గడువువెళ్లినతరువాత ?
నాయ : తరువాతి సంగ తెవరెరుగుదురు ?