50
నాయకురాలు
కొమ్మ : రెంటికీ మన మంగీకరించకపోతేనో ? ?
బ్రహ్మ: దానికి జవాబు వుత్తరములో లేదు.
కొమ్మ : రెంటికీ అంగీకరించమని జవా బియ్యండి.
పిచ్చి రెడ్డి : తొందరపడవద్దు.
కొమ్మ : ఆ ఉత్తరానికి జవా బంతే.
పి. రె : వారి కోర్కెలను మన మంగీకరించనియెడల యేమి చేస్తారో చెప్ప లేదు గనుక ఉత్తరము సౌమ్యముగా వున్నది. సంధిమాటల కవకాశ మిస్తున్నది.
కొమ్మ : రెండునెలలనాడు రాజ్య మిచ్చి, ఈ రోజు మళ్లీ తెమ్మనమంటే రాజీ యేమున్నది ?
అలుగురాజు : ప్రతిపక్షముయొక్క దృష్టితోగూడా మనము యోచించాలె.
బాలచంద్రుడు : అనగా?
అలుగురాజు : వారు చెప్పేకారణాలు కేవలము నిరాధారములు గావు.
కన్నడు : మోసముచేశామంటారా?
అలుగు : కేవలము మోసముగాదు. భిడియపెట్టాము.
బ్రహ్మ: రాజ్యము ఇచ్చివేతామంటారా ?
అలుగు: రాజీగా బోదాము.
పి. రె: పోరునష్టం - పొందులాభం.
బ్రహ్మ: వారికి లోబడివుండడం గిట్టకనేగదా పంచుకొన్నాము ?
పి. రె: ఇప్పటికీ వెనుకటికీ భేద మున్నది. మన హక్కును వా కంగీకరిస్తున్నారు.
బ్రహ్మ : సామంతరాజును తొలగించే అధికారము రాజు కుండదా?