34
నాయకురాలు
4 - వ రంగము
గామాలపాడు ఆవులమంద
[ నాగమ్మ, రామిరెడ్డి, పశువులు ప్రవేశము ]
నా : అయ్యా, నేను ఎటువంటిదాన్నో నీ కొకబిడ్డనున్నాను. నాకు గొడ్లే బిడ్డలుగదా !
రా : గొడ్డూ - బిడ్డా అని గొడ్డునే ముందు జెప్పారమ్మా.
నా : ఎవరో నాబోటెమ్మే చెప్పివుంటుంది. ప్రేమతో బెంచుకొన్న ఈ మందా, పంటకువచ్చిన ఈ పొలాలూ విడిచి గురిజాల బోవడమంటే నా కేమీ మనసొప్పడము లేదు.
రా : నాలుగురోజులు అలవాటుపడ్డదాకా ఏదో క్రొత్తగా వుంటుంది. పట్టవాసం అలవాటుపడ్డవాండ్లకు పల్లెలలో వుండడమూ కష్టమే.
నా : నేను బస్తీలకూ, రాచనగళ్లకూ కొత్తదాన్ని గాక పోయినా పల్లెలకే అలవాటుపడ్డాను. కాని నక్కెక్కడ నాకలోక మెక్కడ!
రా : పట్టవాసమంటే నాకూ తలనొప్పే.
నా : మిరపతోట పూతా పిందే విదులుతున్నది. రాత్రి దోలిన పయరగాలికి రెమ్మలు చిత్తవత్తుగా బుట్టి, నలుదిక్కులా సాగుతున్నవి. కాపుకు వచ్చేలోగా తప్పక సీకాయకుండ పెట్టించు.
రా: అదెంతలో పని !
నా : వరిగచేను విశేషంగా పెరగకపోయినా కాడకంటె యెన్ను పొడుగై ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నది.