నాయకురాలు
121
గప్పిన పగటివలె కాంతిహీన మయినది. విరామఘంట వినబడగానే యెవరిశిబిరములకు వారు పోయినారు. నే నిట వచ్చాను.
నల. రా : వీరారెడ్డికి వీరోచితమరణము సంభవించినది. అతడు లేనిలోపము మనము నివర్తిచేయలేము.
ఝట్టి : సెలవిండు. రణరంగమునకు వెళ్లుతాను.
(నిష్క్రమణం)
నల. రా: ఏ మా కలకలము ?
[ఝట్టిరాజు తెరలో)
యోధాగ్రేసరులారా ! తమ్ముని మరణముచే క్రోధమూర్తియై మలిదేవభూపతి అలరాజు మరణమునకై కసిబట్టివున్న బాలచంద్రుని బాసటచేసుకొని బహుళ సేనాసమేతుడై నరసింగభూపతి నొంటరిగా దాకి పట్టుకొనబోతున్నాడు. బిక్క మొగంబులు వైచుకొని పరువెత్తెద రేల ? మాడుగులరెడ్డి మరణించుటచే అసహాయుడై సేనల గోల్తలు సేయలేకున్న సేనాధ్యక్షుని విడిచి పారిపోయెద రేల ? ఓరీ పాపులార ! బాలుడు పట్టనే పట్టినాడు. అయ్యో, యెంతకష్ట మెంతకష్టము ? సేనాధ్యక్షు డిట్టి దిక్కులేని దుర్మరణమునకు లోబడుట విధినియతిగదా !
నాయ : (లేచి) తే తెమ్ము. ఓరీ! పిరికిపందలారా! నాగాంబిక ఖడ్గము ధరించివుండగా నరసింగభూపతి కెట్టి విపత్తును కలుగ జాలదు. పారిపోయి కలకాలము జీవించగలరా?
(నిష్క్రమణం)