ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నాయకురాలు
115
నర : ఉప్పునీళ్లచేత. త్వరగా పదండి. ఈ నీళ్లే మళ్లీ తాగితే నాలుక మరీ విరుస్తుంది. ముం దెక్కడనయినా మంచినీళ్లు తగలక పోతవా ! ( కొంతదూరం పోతారు. ]
[గోసాయిలు పలాయనం ]
అ. రా : అయ్యా ! నాకు కాళ్లు తీస్తున్నవి. నాలుక పీకుతున్నది. మంచినీళ్లు దొరికితే బాగుండు.
నర : మరే. ఊషరక్షే.త్రం. దగ్గరలో నీళ్లు లేవు. త్వరగా అడుగువెయ్యండి.
అ. రా : ఇంకేమడుగులు. ఇక నడవలేను.
[ అని కూలబడతాడు ]
నర : నే బోయి నీళ్లు తేనా ?
అ. రా : నీ......... [ అని ప్రాణము విడుస్తాడు. ]
నర : నడిదార్లో యెందుకు ఈ పీనుగ ; రాయబారం ముగిసింది.
[ శవాన్ని పక్కచేలోకి లాగి నరసింరాజు వెళ్లుతాడు. ]