పుట:Naayakuraalu.Play.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

నాయకురాలు

లర్పించడంకంటె వెంటనే దండయాత్రజరిపి పల్నాటికై ప్రాణాలర్పిస్తాము.

బ్రహ్మ : ఏదోవిదంగా యుద్ధములో చనిపోవడమే మన వుద్దేశం గాదు. నలగామరాజు పెట్టేబాధలను ఓపికతో సహించడమునకే యెక్కువధైర్యము కావలసివున్నది. ఇప్పటికి ఒక్క లంకన్నను గోల్పోవడము దప్ప తక్కిన మన చట్రమంతా యింతవరకు చెక్కుచెదరలేదు. మన అనుచరుల సంఖ్యకూడ క్రమంగా హెచ్చుతున్నది. పశుధనం వృద్ధయింది. సత్యం కొరకు కష్టా లనుభవిస్తున్నామని లోకు లనుకొంటున్నారు. గట్టిప్రయత్నం చేసేయెడల మన అనుచరు లింకా వృద్ధవుతారు. మన యువకు లింకా కొద్దికాలము ఓపిక పెట్టుకొనే యెడల ఇహపరాలు రెండూ మనవౌతవి. మనమందరమూ మండాది విడిచి పల్నాటికుట్రలకు దూరంగా శ్రీశైల ప్రాంతమున మేడపిలో దిగుదాము. అది తృణకాష్టజలసమృద్ధి గల అడవిప్రదేశము. అక్కడ ఒకరిఆటంకము లేకుండా మనము యుద్ధప్రయత్నములు చేసికోవచ్చు.

మ. దే. రా : మనకు బహునాయకం పనికిరాదు. నాయుడుగారు చెప్పినట్టుపోవడందప్ప మరొక మార్గము మనకు పనికిరాదు. మేడపికి ప్రయాణం సాగించి మిగిలినరోజులు అక్కడ గడుపుదాము.

[ తెర పడుతుంది ]