పుట:Naajeevitayatrat021599mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

మునిసిపల్ రాజకీయాలు

నేను స్వతంత్రంగా కాలక్షేపం చేస్తూ రెండు చేతులా డబ్బు సంపాదిస్తూ వుండి, ఆనాటి రాజమహేంద్రవరం మునిసిపల్ రాజకీయాల్లో పడ్డాను. రాజమహేంద్రవరం మునిసిపాలిటీ ఆంధ్రదేశంలో కల్లా పురాతనమైన మునిసిపాలిటీ. దానికి సుమారు 50, 60 వేల రూపాయల ఆదాయం వుండేది. నేను రాజమహేంద్రవరం చదువుకోసం వచ్చే రోజులకే మునిసిపల్ రాజకీయాలు బాగా జోరుగా వుండేవి. అప్పటికి ఏలూరి లక్ష్మీనరసింహంగారు మునిసిపల్ ఛైర్మన్ గా వుండేవారని ఇదివరకే వ్రాశాను. ఆయనకి పూర్వం వుద్యోగులు-అంటే కాలేజీ ప్రొఫెసర్లు, రెవిన్యూ వుద్యోగులు ఛైర్మన్లుగా వుండేవారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారే మొదటి నానఫీషియల్ ఛైర్మన్. మునిసిపాలిటీలో ఆయన కిరీటంలేని రాజులాగ చలామణీ అయ్యాడు అప్పటికే సుబ్బారావు పంతులుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, నేతి సోమయాజులుగారు మొదలైనవారు పురప్రముఖులై, ఏలూరి లక్ష్మీనరసింహంగారిని ఓడించడానికి అవకాశం వచ్చినపుడల్లా ఏదో విధంగా ప్రయత్నిస్తూనే వుండేవారు. ఆయనమీద ఏవో రకరకాల పన్నాగాలు పన్నేవారు. సుబ్బారావు పంతులుగారు ప్రసిద్ధ రాజకీయ నాయకులై ఆ తరవాత 'ఆంధ్రభీష్మ' బిరుదం పొందగలిగినారు; కాని, అప్పట్లో స్థానిక రాజకీయాల్లో బహులౌక్యులు. తమరు వెనకాల వుండి తమ ముఖ్యశిష్యులచేత తమాషాగా నాటక మాడించేవారు. ఆయనకి అదొక విలాసం. ఇతరుల మీద బహు నేర్పుగా దెబ్బలు తీస్తూ వుండేవారు. కాని, ఏలూరి లక్ష్మీనరసింహంగారు మాత్రం లొంగేవారు కారు. మెరక వీథి తెలగాలు షాహుకార్లు కొందఱూ ఆయనకి పట్టుగా వుండి సుబ్బారావుపంతులు ప్రభృతులు చేసే ఎత్తులు అన్నీ భగ్నం చేసేవారు.

లక్ష్మీనరసింహంగారి మీద రకరకాల నిందలు పడ్డాయి. ఆయనకి