పుట:Naajeevitayatrat021599mbp.pdf/819

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసుకోవలసిన ఏర్పాట్లు మొదలైన విషయాలు ఈ సంఘానికి పనిగా అప్పజెప్పారు.

అయితే, అంతకుపూర్వం శాసన సభ్యులు నూతన ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధాని పట్నంగా ఏదో ఒక పట్నాన్ని నిర్ణయించుకోవాలి. ఇదికూడా పూర్వము విభజన సంఘం చేసిన సూచనలలో ఒకటే.

అపుడు, సవ్యంగా సరిఅయిన రాజధాని పట్నం ఏర్పాటు చేసుకొనే వరకు, చెన్నపట్నంలో తాత్కాలికంగా ఆంధ్ర ప్రభుత్వం నడపడానికి అవకాశం ఇవ్వవలసిందని, ఆ విభజన సంఘంలో ప్రకాశంగారు గట్టిగా పట్టుపట్టారు. తమిళ సభ్యులు దానికి అంగీకరించలేదు. మిగిలిన ఆంధ్ర సభ్యులు తమిళులతో ఏకీభవించారు. అప్పుడు విభజన ఆగిపోవడానికి ఇదికూడా ఒక పెద్ద కారణము. ఇది అయిన సంవత్సరం తర్వాతనే కదా శ్రీరాములుగారు ప్రాయోపవేశము చేసినది!

ఆయన ప్రాయోపవేశం జరిగిన తర్వాత, చెన్నపట్నం వదులు కోవడానికి ఒప్పుకొన్న తర్వాత 'శుభస్య శీఘ్ర' మని మా కనిపించింది. ఇప్పుడు శాసన సభ్యులు తాత్కాలిక రాజధాని పేరు సూచించగానే, ఈ విభజన సంఘం పని ఆరంభించగలదని నెహ్రూగారు, ప్రకాశంగారితో ఆ సమావేశంలో అన్నారు.

తాత్కాలిక రాజధానిని సూచించడానికి ఆంధ్రప్రాంతానికి చెందిన శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడానికి అధికారరీత్యా ఆదేశం పంపుతామని ఆయన చెప్పారు. మేము తిరిగి వచ్చేసరికి, ఆ ఆదేశం చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దాని ప్రకారం చెన్నరాష్ట్ర శాసన సభామందిరంలో శ్రీ ప్రకాశంగారి అధ్యక్షతన ఆంధ్ర శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పూర్వం ముందుగా ప్రకాశంగారు - కృషికార్‌లోక్ పార్టీ తరపున గౌతులచ్చన్న గారినీ, కమ్యూనిస్టు పార్టీ తరపున టి. నాగిరెడ్డిగారినీ ఆహ్వానించారు.

శాసన సభ్యులు నూతన రాజధానిని సూచించాలి అనే ప్రతిపాదన