పుట:Naajeevitayatrat021599mbp.pdf/807

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ గెలిచిన వారిలో, రాష్ట్రంలో గౌరవ ప్రతిష్ఠలున్న పెద్ద నాయకు లెవరూ లేరు.

1946 లో రాజాజీని చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే యత్నంలో గాంధీగారు ప్రకాశంగారి చేతులలో ఓటమి పొందిన దిదివరకే వ్రాశాను. రాజాజీ ఆశాభంగ నైరాశ్యలోకంలో ఉండడం గాంధీగారికి అసంతృప్తికరంగా ఉండడంచేత, రాజాజీకి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చిక్కనప్పుడు కాంగ్రెసు అధ్యక్షులే నేరుగా పావలా చందా పుచ్చుకొని ఆయనను సభ్యుణ్ణిగా చేర్చుకొనేటట్టు చేసినది యిదివరలో వ్రాశాను.

రాజాజీలో ఏదో ఇంద్రుని అంశ ఉంది. అందుచేతే, తాను పాకిస్తాన్ వాదియైనా, గాంధీగారి ఆశీస్సులతో నెహ్రూగారి మంత్రివర్గంలో దేశ పరిపాలనలో భాగస్వామి అయ్యారు. స్వాతంత్ర్య ఘోషణ జరిగిన నాటికి ఇంత మేథావి లేరని నెహ్రూగారి మనసును వశం చేసుకొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన పిదప బెంగాల్ గవర్నరుగా వెళ్లారు. అక్కడినుంచి, మౌంట్ బాటను ప్రభువు గవర్నర్ జనరలు పదవినుంచి విరమించగానే భారతదేశానికి తాను గవర్నర్ జనరలు అయ్యారు. 1950 జనవరి 26 న భారతదేశ నూతన సంవిధానం అమలులోకి వచ్చేదాకా ఆ పదవిలో ఉండి, తర్వాత చెన్నపట్నంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు.

ఆయన కేంద్ర మంత్రిగా, ఢిల్లీలో, తన వర్గాన్ని ఓడించి ముఖ్యమంత్రి అయిన ప్రకాశంగారిమీద ఒక విధమైన అధికారంగల పదవిలోకి వెళ్ళారు. ఒకసారి చెన్నరాష్ట్రంలో ఉన్న అడవి కలప కేంద్ర ప్రభుత్వంవారు కొనవలసిన అగత్యం వచ్చింది. ప్రకాశం ప్రభుత్వంవారు ఏదో ఒక ధర అడిగారు. కేంద్రశాఖవారు అంత ధర ఇవ్వమని వాదించారు. ఇది శాఖల స్థాయిలో జరిగిన వ్యవహారము. అపుడు రాజాజి ప్రకాశంగారికి అర్దాధికార పూర్వకమైన (Demi - official) ఉత్తరం వ్రాశారు. అందులో ఇలా ఉన్నది.

"ప్రకాశంగారూ! ప్రతిదినమూ మీ ప్రభుత్వం మా ప్రభుత్వం