పుట:Naajeevitayatrat021599mbp.pdf/774

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని (కాంగ్రెసుచే నియమింపబడి) వచ్చినవారిని తీవ్రంగా కొట్టి సభ అవతలికి నెట్టేశారట.

ఆతర్వాత రెండుగంటలసేపు ప్రకాశంగారు యథేచ్చగా ఉపన్యసించారని, ఆయనకు సన్నిహితులైన ముదలి వెంకటేశ్వరరావుగారు నాతో ముచ్చటిస్తూ అన్నారు.

అటువంటి గుండె దిటవుకు ప్రకాశంగారు పెట్టినది పేరు

1945 లో మేము జైలునుంచి విడుదలయి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో పర్యటించడం జరిగింది. అప్పటికి కాంగ్రెసునుంచి విడిపోయి, కమ్యూనిస్టులైన కొందరు మిత్రులు ఒక బహిరంగ సభలో ప్రకాశంగారిని తూలనాడ నారంభించారు. అక్కడి ప్రజలు అలా తూలనాడిన మనిషిని అదమాయిస్తూ ఉంటే, ప్రకాశంగారు, "అత నెవరో చిన్న కుర్రవాడు. ఏమీ అనకండి!' అని సర్దుబాటు చేశారు.

కాని, మేము తర్వాతి గ్రామం వెళ్ళేసరికి కమ్యూనిస్టు మిత్రులు హెచ్చు బలంతో వచ్చి అల్లరి చేయబోయారు. అక్కడేమో - ప్రేక్షకులు వారిని బలవంతంగా బయటికి త్రోసేశారు. మేము ఆ తర్వాత గ్రామానికి వెళ్ళేసరికి రమారమి పదకొండు గంటలు కావచ్చింది. ఎవరో ఒకరింటి ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. వేయి మందికి సరిపోయే ఆ చోట దాదాపు నాలుగువేలమంది ఇరుక్కొని కూచున్నారు. మీటింగు ఆరంభమయేసరికి దాదాపు యాభైమంది కమ్యూనిస్టు మిత్రులు నినాదాలు చేస్తూ, బాణాకఱ్ఱలు త్రిప్పుతూ ఒక ప్రక్కనుంచి ప్రేక్షకుల మీదికి దుమికారు. ప్రజలు లేచిపోసాగారు. వారికీ వీరికీ జరిగిన సంకుల సమరం, ప్రకాశంగారూ నేనూ కూచున్న వేదికను సమీపించ నారంభించింది. సమావేశం ఏర్పాటుచేసిన పెద్దలు కొందరు ప్రకాశంగారి దగ్గరికి తొందరగా వచ్చి, "వారి బాణాకఱ్ఱలు, వీరి బాణాకఱ్ఱలు మీకు తగులుతాయి. మీరు లేచి గదిలో కూచోండి. మేము ఆ కమ్యూనిస్టులను తరిమివేసిన తర్వాత మీరు ఇవతలకు రావచ్చును," అన్నారు.

ప్రకాశంగారు - "దెబ్బలు ఎలా తగులుతాయో చూస్తానులే!