పుట:Naajeevitayatrat021599mbp.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్మిక సంఘాల చరిత్ర

పోయిన యుద్ధంలో కార్మిక నాయకుల సహకారంతో కార్మిక సంఘాలద్వారా ప్రభుత్వంవారు ఎల్లా లాభం పొందిందీ మనకి విశదమే. ఈ నాటి కార్మిక సంఘాలు కాంగ్రెసుతో సమైక్యమయాయనీ, కార్మిక మంత్రిగా వి. వి. గిరిగారు ఈ కార్మిక విషయాలలో మాకు 'నిధి'గా ఉంటూ, 1937 లోని కాంగ్రెసు మంత్రివర్గంలోనూ, దర్మిలా స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాతా ఆయన అఖండమయిన సేవ చేశాడని ఇప్పట్టున చెప్పడం న్యాయం.

1928 - 30 సంవత్సరాలలో కార్మిక సంఘాలే గనుక మా కాంగ్రెసులో చేరి ఉంటే, మా విజయం ఎంతో ఘనంగానూ, ఇంకా ఎక్కువ సమగ్రంగానూ ఉండి ఉండేది. పరిపాలకులకు భారత దేశంలోని కార్మిక సంఘాలు పెట్టని కోటలై, వారి చిత్తానికి లోబడి, వారనేక విధాల లాభాలు పొందడానికి వీలుగా సహకరిస్తూ వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెసువారు కార్మిక సంఘాలకి నిన్న మొన్నటివరకూ ఎటువంటి సహకారమూ ఇవ్వలేకపోయారు.

1935 లో రాజ్యాంగ విధానంలో వచ్చిన మార్పులకు పూర్వం, ఈ కార్మిక విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం క్రిందనే ఉండేవి. 1935 కు పూర్వం రాష్ట్రాలలోని కార్మిక సంఘాలద్వారా ఏదో సహాయానికి అవకాశం ఉండేదట. కాని ఈ 1935 దాకా ఏ రాష్ట్రంలోనూకూడా, ఏ విధమయిన సహకారమూ కార్మికులకు ఇవ్వలేకపోయాము. కేంద్రంలో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వ విధానం మూలంగా కార్మికులకి ఏ విధంగానూ అవసరమయిన సహాయం చేయలేకపోయాం. కార్మిక నాయకు లెంతటి దిట్టలయినా, ప్రభుత్వ విధానం కారణంగా, ఏ విధంగానూ ముందడుగు వేయలేక పోయారు. మేము ఈ విషయంలో తీసుకువచ్చిన ప్రతిపాదనలూ నడపిన చర్చలూ వృధాయే అయిపోయేవి.

దేశంలో ఉన్న కార్మికుల విషయమే ఇలా ఉంటూంటే సముద్రాలకు అవతల ఆయా ఖండాలలో నివశిస్తూ అనేక బాధలకు