పుట:Naajeevitayatrat021599mbp.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

సైమన్ కమిషన్ నియామకం

సద్బుద్ధితో కానేకాదు

1927 లో వచ్చిన రెండవ పెద్ద సమస్య సైమస్ కమిషన్ నియామకం. భారత దేశానికి అనువైన రాజ్యాంగ చట్ట సవరణలూ, సంస్కరణలూ సూచించడానికని బ్రిటిష్ ప్రభుత్వం వారు సైమన్ కమిష నొకటి వెయ్యడమూ, ఈ నాటకం సాగకుండా చూడాలని కాంగ్రెసు వారు తలచడంతో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం ఆరంభం కావడమూ జరిగాయి. అది ఈ రోజులలోనే ఎందు కొచ్చింది? అసలు కమిషన్ని వెయ్యమని ఎవరు కోరారు? ఇలాంటి ప్రశ్నలు ఈ సందర్భంలో చాలామంది వెయ్యడమూ, వారికి తోచిన సమాధానం చెప్పడమూ జరిగింది.

గత యాబై-అరవై సంవత్సరాల కాలంలో అనేక దేశాలు సాధించిన విజయాలూ, సంపాదించిన సంస్కరణాదులతో పోల్చి చూస్తే- మన స్వాతంత్ర్య సమరం అనవసరంగా ఏండ్లూ పూండ్లూ పట్టి ఏమీ సాధించకుండా నడుస్తోందేమో ననిపిస్తుంది. మన జ్ఞాపక శక్తులు కుశలమే అవడాన్ని సైమన్ కమిషన్ విషయంలో ఉత్పన్నమయిన రెండు ప్రశ్నలకూ రకరకాల సమాధానాలు వచ్చాయి.

కొంతమంది ఈ సైమన్ కమిషన్ అన్నది మనకి అనవసరమయినదీ, నిరుపయుక్తమయినదీ అన్నారు. 1920 లో ఇంగ్లండులో జనరల్ ఎన్నికలు జరుగనై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని విరమిస్తూన్న ప్రభుత్వం తాము భారత దేశాన్ని గురించి ఎంతగానో శ్రద్ధ వహించి, దాని పురోభివృద్ధికి ఎంతో చేశామని అనిపించుకోవడానికే ఈ కమిషన్ని వేశారని మరి కొంద రన్నారు.