పుట:Naajeevitayatrat021599mbp.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగే పరిణామాలు

స్థూలంగా ఆ కరెన్సీ ప్రతిపాడనల పరిణామాలు ఎంతవరకూ ఉంటాయో చదువరులకు కాస్త అర్థం అవడానికగాను ఈ విషయం ఇంత వివరంగా చెప్పాను. కేంధ్రలోనూ, రాష్ట్రాలలోనూ పన్నుల రూపకంగా కొంత డబ్బు వసూలు పరచి, కేవలం తమ బలగానికి జీత భత్యాల క్రింద ఖర్చు పెట్టడానికి మాత్రమే కాదు ఇంగ్లీషువారు ఇండియాని తమ చేతులలో పెట్టుకున్నది. వారికి ఈ పన్నుల వసూళ్ళ కోసం కొన్నివేలమంది జీతగాళ్ళు బ్రతకడం కంటే ఎంతో విలువయిందీ, ముఖ్యమయిందీ ఇంకొకటి ఉంది. ఎంతసేపూ వారికి కావలసింది ఇండియాతో వర్తక వాణిజ్యాల పెరుగుదల మాత్రమే. అదే అన్ని విధాల తమకి వాంఛనీయమైన విషయం. ఆ వాణిజ్యాదుల రక్షణ కోసమే మిగతా తతంగమంతా. నిజంగా వారు మనతో సమాన ఫాయలో వర్తక వాణిజ్యాలు సాగించి ఉంటే, మన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేది. ఈ నీచమయిన బీదరికంతో దేశమూ, ప్రజలూ ఇలా ఇక్కట్లు పాలయ్యేవారు కాదు.

ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దానిని కొంచెం లోతుగా పరిశీలించాలి. మారకపు విలువ 1 షి. 4 పె. ల చొప్పున మన రైతు ఒక బస్తా సరుక్కీ 15 రూపాయలు సంపాదిస్తూ ఉంటే. అదే సరుక్కి మారకపు రేటు 1 షి. 6 పె. లకు పెరిగిన కారణంగా మన రైతుకి ముట్టేది రూ 13-5-4 లు మాత్రమే. ఈ ఒక్క చిన్న కారణంగా 1928 నుంచీ ఏటా 40 కోట్ల మేరకు మనకు నష్టం అన్నమాట! అంటే, ఇప్పటివరకూ (1941 వరకూ) మన రైతుకి వచ్చిన నష్టం ఎంతో తెలుసా! 40x13, అంటె 520 కోట్లన్నమాట! ఈ మదింపు 1925లో మన దేశంనుంచి ఇంగ్లడుకు ఎగుమతి అయిన సరుకు రు 316 కోట్లు విలువగలదని తేల్చిన అంకెపై ఆధార పడింది.

మనకి ఈ నష్టాల సంగతి ఇల్లా ఉండగా, వారి దేశం నుంచి మన దేశానికి వచ్చే సరుకు (దిగుమతులు) సంగతి గమనిద్దాం. వారి