పుట:Naajeevitayatrat021599mbp.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ సంస్కరణల వాయిదా

బ్రిటిషువారు బహు నేర్పరులు. మామూలుగా అవసరాన్నిబట్టి రాజ్యాంగంలో తీసుకు రావలసిన చిన్న చిన్న మార్పులను కూడా వాయిదాలు వేయడమూ, ప్రజలలో లేనిపోని ఆశలు కల్పించడమూ, హిందూ మహమ్మదీయ స్పర్థలూ, బ్రాహ్మణ బ్రాహ్మణేతర వివాదాలూ తలలెత్తకుండా సహకరించి వాటిని రూపు మాపుతాం అంటూ, వాటికి ద్రోహం చెయ్యడమూ జరిగేవి. చురుక్కుమనిపించే మింటో-మార్లే సంస్కరణలు 1909లో అమలు పరచి, మతావేశాలనూ, మత కలహాలనూ తీవ్రతరం చేశారు. ఈ మత కలహాలు మాన్‌ఫర్డ్ సంస్కరణల కాలం (1916-17)లో మరీ ఉద్ద్రుతంగా జరిగాయి. అవి 1935 దాకా అల్లా అల్లా వేళ్ళు నాటుకుంటూనే ఉన్నాయి. అప్పుడు కళ్ల తుడుపుగా "గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్" అని ఒక చట్టాన్ని అమలుపరచి, దాని క్రింద "ప్రొవిన్షియల్ అటానమీ" అనే విధానాన్ని అమలు పరిచారు.

1926-30 ల మధ్య హిందూ మహమ్మదీయ కలహాలు ఏటేటా జరుగుతూ ఉండడమూ, పట్టపగలే వందలాది అమాయక ప్రజలు హత్యలకు గురి అవుతూండడమూ జరిగేది. అందు 1927 లో అట్టి హత్యాకాండ మరీ ముమ్మరంగా సాగింది. లాహోరులో మే మాసంలో తీవ్రమయిన హిందూ మహమ్మదీయ సంఘర్షణలు జరిగాయి. 1926-30 ల మధ్య ఏటేటా ఉత్తర హిందూస్థానంలో అఖిల పక్ష సమావేశాలు జరగడమూ, అందు మత కలహాలు అంతం అవడానికి సూచనలు చేయబడడమూ, భారత దేశానికి అనువయిన కట్టుబాట్లతో "కాన్ట్సిట్యూష" నొకటి తయారు చెయ్యడానికి ప్రయత్నాలు జరగడమూ మామూలయింది.

బ్రిటిషువారి పన్నాగం

1926-27లో భారత దేశపు రాజకీయ అవసరాలను గుర్తించి, వలసిన సలహా లివ్వడానికి, సూచనలు చెయ్యడానికి "సైమన్ కమి