పుట:Naajeevitayatrat021599mbp.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తా ఘోరాలు

అంతవరకూ జరిగిన కొట్లాటల కంటే కలకత్తా సంక్షోభమే చాలా ఘోరంగా పరిణమించింది. తాము దానిని అణచగలమనే విశ్వాసంతో మహాత్మా గాంధీగారు, సేన్ గుప్తాగారితో కలిసి ఆ ప్రాంతానికి హడావిడిగా వెళ్ళారు, కాని అక్కడి పరిస్థితులు ఏనాడో చెయ్యి దాటిపోయి అదుపులో ఉంచడానికి వీలులేని పరిస్థితికి దిగజారిపోయాయనీ, ఈ పరిస్థితులు ఇల్లాగే ఇంకా కొంతకాలం సాగితే ఇరు వైపులా వేలాది జనం నిహతు లవుతారనీ, బహుశ: అప్పటికిగాని వారు కళ్ళు తెరవరనీ వాపోతూ, తన నిస్సహాయ స్థితిని గాంధీగారు ఒప్పుకున్నారు. అ తర్వాత వారు-ఒక పనికి మాలిన హింసాకాండలో ఇరుక్కుని, అనవసర రక్తపాతానికి కారకుల మయ్యామన్న సంగతి గ్రహించారు. ఇది 1924 లో గాంధీగారి విడుదల అయిన తర్వాత రెండేళ్ళకు జరిగిన సంఘటన.

17

కాంగ్రెసువారి తొలి ఎన్నికలు: ఆంధ్రదేశం

ద్వంద్వ ప్రభుత్వం ఎలా పరిణమిస్తుందో కూడా స్వరాజ్యపార్టీ వారికి అనుభవం అయింది. గాంధీగారి విడుదల అనంతరం రెండు సంవత్సరాల కాలంలోనూ కాంగ్రెసు కార్యక్రమ సాఫల్యానికి ఎంత మాత్రమూ కృషి చేయలేక పోయారు. అయినప్పటీకి 1924 లో బెల్గాంలో తమకు గాంధీగారి ద్వారా హస్తగతమయిన కాంగ్రెసు నాయకత్వాన్ని వదులుకుని, దానిని తిరిగి గాంధీగారి హస్తగతం చేయడానికి వారికి మనస్సు రాలేదు.

శాసనసభా ప్రవేశ కార్యక్రమం

"మా కోర్కెలను మన్నించకపోతే మంత్రి పదవులను కూడా చేపట్టి తీరుతాం, సఫలీకృతుల మవుతాం" అనే స్వరాజ్య పార్టీ వారి