పుట:Naajeevitayatrat021599mbp.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకారం చేస్తే అ.భా.చ. సంఘం వారికి సంబందించిన పూచికపుల్ల కూడా మావద్ద ఉండదన్నమాట.

మా వాదన సరి అయినదనీ, అ.భా.చ. సంఘంవారి క్లెయిము లా ప్రకారం చెల్ల నేరదనీ నాకు బాగా తెలుసు. అందుచేతనే వేసిన దావాను ప్రతిఘటించమని సలహా ఇచ్చాను.

ఏది యెల్లా ఉన్నా దావా కోర్టులో నడుస్తూన్నంత కాలమూ ఇది ఒక అవాంఛనీయమైన చికాకు పంచాంగంగానే మేము భావించాము. గాంధీగారి పద్దతులు ఒకొక్కప్పుడు బ్రిటిషువారు అవాంతర పరిస్థితులలో అవలంబించే పద్దతుల లాంటివే. కేంద్రంలోగాని, రాష్ట్రాలలోగాని కొన్ని కొన్ని అవాంతర పరిస్థితు లేర్పడినప్పుడు, వారొక పద్దతిని అవలంబించేవారు. ఏదయినా అవాంతరాలు వచ్చినప్పుడు లాయరు సలహా తీసుకోవడమూ, వెంటనే అ సలహాను పాటించి అవసర చర్యలు తీసికోవడము మామూలు. అంతేగాని, వారుచేస్తూన్న పని న్యాయమయిన దవునా కాదా అన్న విచారణ ఉండేది కాదు. వారట్టి పద్దతి అవలంబించడానికి కారణం వారికి లాయర్లయందుండే విశ్వాసమే. ఏదయినా గడ్డు పరిస్థితి యేర్పడినప్పుడు, తాము ఒక నిశ్చయానికివచ్చి కార్యక్రమం సాగించడమూ, అనుమానం వస్తే వెంటనే లాయరు సలహా తీసుకుని వ్యవహరించడమూ వారికి మామూలు. వారంతట వారు ఆలోచించరు. ప్లీడరు చెప్పిందే వేదవాక్కు. గాంధీగారి పద్ధతి కూడా ఒకొక్కప్పుడు అల్లాగే ఉండేది. తానే స్వయంగా లాయరయి, సంగతులు సవ్యంగా అవగాహన చేసుకుని, ఒక మార్గాన్నీ త్రొక్కితే మంచిదనే ఊహ పుట్టినప్పుడు, బాధ్యతలను విస్మరించకుండా, దర్జాగా కోర్టుకు వెళ్ళాలి. అవును. దర్జాగానే వెళ్ళాలి. కోర్టు ఖర్చులు సామాన్యమా మరి!

ఎవరయినా దగా చేసినా తప్పించుకోడానికి దారి చూపించాలని కాదు నా ఉద్దేశం. న్యాయం తమదన్న నిశ్చయం ఉన్నప్పుడు ధీమాగానే కోర్టుకు వెళ్ళాలిగాని, అన్యాయాలను న్యాయాలుగా నిరూపించడానికి కాదు.