పుట:Naajeevitayatrat021599mbp.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మింపజేయకుండా అల్లాగే సాగించిఉంటే, అధికారులు అవలంబించిన దమన విధానం ఫలితంగా ప్రజలలో నిరుత్సాహం బయలుదేరి, నైతిక పతనం జరిగిఉంటే, తిరిగి వారిని ఉత్తేజపరచి దారిలో పెట్టడానికి యుగాలే పట్టేది. సకాలంలో ఉధ్యమ విరమణజేసి ప్రజలలో ఐక్యాన్నీ, జాతీయ భావాన్నీ మంచి స్థాయిలో నిలబెట్టి గలిగిన కారణాన్నే, 1923 వ సంవత్సరంలో శాసన ధిక్కార సంఘం (Civil Disobedience) వారి రాక సందర్భంలో జారీ చేయబడిన 144 వ సెక్షన్ ఉల్లంఘన జరగడమూ, సుమారు మూడువందలమంది వరకూ నిర్బందింప బడడమూ జరిగింది.

గుణపాఠం

ఈ పన్నుల నిరాకరణ ఉద్యమ విరమణ జరిగిన పెక్కు సంవత్సరాల అనంతరం లార్డ్ విల్లింగ్‌డన్ గుంటూరు సందర్శించడం జరిగింది. గుంటూరు వాస్తవ్యులు ఉత్సాహంగానే తనను ఆహ్వానిస్తారని అనుకున్నట్లున్నాడు, పాపం! మూయబడిన తలుపులూ, ఖాళీ వీథులూ మాత్రమే ఆయన్ని ఆహ్వానించాయి. విరమణ, లొంగుపాటు అన్నవి ఓటమికి చిహ్నాలుకావు. నిజానికి సకాలంలో తీసుకున్న చర్య లొంగు బాటుకే దారితీసినా, అది ప్రజలలో నూతన చైతన్యాన్నీ, బలాన్నీ, ఉద్రేకాన్ని కలుగజెయ్యడానికి ఎంతయినా ఉపకరిస్తుంది. గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమమూ, విరమణా పై సత్యాన్నే చాటాయి. నిర్మాణ కార్యక్రమ ఫలితంగా, ప్రత్యామ్నాయ పరిపాలనా విధానానికి ప్రజలు సిద్ధపడ గలిగిననాడు ఎటువంటి ఉద్యమం అయినా ఘనవిజయాన్ని సాధిస్తుంది. పన్నుల నిరాకరణ, ఆస్తుల జప్తులూ, వేలాలూ మున్నగు లావాదేవీలకు దారి తీస్తుంది. అందువలన శిక్షాస్మృతులను ఉల్లంఘించి జైళ్ళకు వెళ్ళడం సులభం. 1921 లో ప్రభుత్వం వారు తీసుకున్న విపరీత చర్యల ఫలితంగా నిర్మాణ కార్యక్రమం ఆగిపోయి ఉండకపోతే దేశం ఎన్నో విధాల ముందడుగువేసి ఉత్పన్నం కాబోయే పరిస్థితులకు సిద్ధపడే ఉండేది.