కర్ణాట, మళయాళస్త్రీ లానాడు ఱవికలు లేనివారే! ప్రతిష్టానసంగతిచే నంధ్ర కర్ణాటాంగనలు పైcటలను అవికలను దాల్చిరిగాని యదిలేని ద్రవిడ మళయాళస్త్రీలు, నేఁటికిని వానిని దాల్పనివారుగానే యున్నారు. పురుషులువోలె స్త్రీలును, (నేఁడును మళయాళమున నున్నట్లు) కొన్ని సమయములందు ఉత్తరీయమును దాల్చుటేకాని, అవికలం దాల్చుట యాకాలమున దక్షిణభారతదేశమున లేదు. ప్రతిష్టానసంబంధము సాతవాహనుల తర్వాత నంధ్రదేశమునకు లేదు. సాతవాహనులతర్వాతం బ్రతిష్టాననగరము పాడుపడి పల్లెటూ రయినది. పైఠిణీ రవికలును పైCటలును బ్రతిష్ణానము రాజధానిగా నొప్పచున్నప్పడే వెలయుట సంగతము. నాఁటి ప్రతిష్టానము, కృష్ణా గోదావరీ నదీసాగరసంగము దాఁకఁ గల యంధ్రదేశముతోఁ బ్రబలసంబంధము గల దనుటను పైంట పైఠిణీఱవిక పదములు నిరూపించుచున్నవి. శాసనములం దేనాఁడు సాతవాహనులు రాజ్యమేలినట్టుగా గలదో యానాండే యంధ్రదేశము (ముళక) నేలినట్లును గలదు. వారాంధ్రులని పురాణములు చెప్పచున్నవి. నేఁటి యాంధ్రదేశమునకే తక్క నితర దేశములకు వేనికిని నంధ్రనామ మేనాఁడును గానరాదు. సాతవాహను లంధ్రదేశముతో పాటుగా నితరదేశములను గూడ జయించి పాలించుట వారియంధ్రతకు రంజకము కాందగునుగాని భంజకము గాంగూడదు. తొలుదొలుతటి వారిరాజ్యము ముళ్లకదేశములోని "సాతాహని రట్ట" మగును. సాతవాహనుల యంధ్రత యిన్నివిధములC బ్రవ్యక్తమగుచుండంగా, వా రంధ్రులుగా రనియు నంధ్రదేశమును బాలింపలేదనియుఁ జేయు వాదములకు విలువ నిలువఁ గలదా? విష్ణుపురాణమున వర్ణితులగుముండకులే ముళకు లగుదు రని