11
దక్షిణదేశమందలి ఆంధ్రవాఙ్మయము
క్రీ.శ. 1400 తరువాతినుండి తురుష్కులయు, గజపతులయు నలజడి యంధ్రదేశము నత్యధికముగ నలముకొన్నది. క్రీ.శ. 1430 ప్రాంతపుటలజడిని చూడలేక తాళ్లపాక యన్నమాచార్యుఁ డిట్లు సంకీర్తన రూపమున విలపించినాఁడు.
రామక్రియ
పల్లవి
తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమా!!
చరణములు
తుటుములై భూసురుల తుండెములు మొండెములు
నిటువలె భూతములు యెట్టు మోcచెనో
అటు బాలుల రొదలు ఆకాశ మె ట్లోరిచెనో
కటకటా యిట్లాయc గలికాలమహిమా!!
అంగలార్చే కామినుల యంగభంగపు దోcపు
లింగితాన మింట సూర్యఁ డెట్టు చూచెనో
పొంగు నానాజాతిచేత భువన మె ట్లానెనో
కంగి లోక మిట్లాయఁ గలికాలమహిమా!!
అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలార్వంగ
సరిధర్మ దేవ తెట్టుసమ్మతించెనో
పరధనచూర కెట్టు పట్టాయెనో లక్ష్మి
కరుణ యెం దణఁగెనో కలికాలమహిమా!!
దేవాలయాలు నానాదేశము లెల్లాఁ జొచ్చి
దేవఁగా నె ట్లుండిరో దేవతలు
తావు లేలేరాజులకు దయ గొంత పుట్టదాయ
కావరమే ఘనమాయc గలికాలమహిమా!!