104
మీఁగడ తఱకలు
ఇంకొకసాధకము
ఇన్ని సరిపడినను నుద్భటారాధ్యచరిత్రరచనాకాలమును, బాండురంగమాహాత్మ్యరచనాకాలమును నొక్కపురుషుని జీవిత పరిమాణము నందుఁ బొందనివిగా నుండినచో నిఁక నీ వాదమెల్ల వమ్మయి పోవలసినదే యగును. ఆచిక్కులేకుండ నదియుఁ గుదురుచున్నది. ఒక్కనికే రెండుపే ళ్లనుసిద్ధాంతము నిర్వివాదముగా నిల్చుచున్నది.
ఉద్భటచరిత్రరచనాకాలము
కొండవీడుదుర్గాధ్యక్షుఁడుగా నున్ననాదిండ్లగోపమంత్రికడ ముఖ్యోద్యోగి యయినయూరెదేచమంత్రి యుద్భటారాధ్యచరితము కృతి గొన్నాఁడు. అది యెల్లఁ గృత్యవతరణికలోఁ జూడఁదగును. శ్రీకృష్ణదేవరాయఁడు క్రీ. 1515 సం!! కొండ వీడు జయించెను. అది మొదలుగాఁ గృష్ణరాయల యేల్బడి కది లోపడినది. రాయలమంత్రి యగుసాళ్వ తిమ్మరసు కొండవీటి పాలనమును దన మేనల్లుఁ డగునాదిండ్ల గోపమంత్రి కప్పగించెను. నాదిండ్ల గోపమంత్రి సుప్రఖ్యాతుఁడు. గోపమంత్రి క్రీ. 1517న దేచమంత్రి కొక యగ్రహారము నొసఁగెను.
దేచమంత్రి శైవాచారపరాయణుఁడు. ప్రోలనారాధ్యునివంశమువాఁ డగుచంద్రశేఖరవాచంయముని శిష్యుఁడు. మఱియు మహావిద్వాంసుఁ డగులొల్ల లక్ష్మీధరపండితునకును శిష్యుడు. ఆలక్ష్మీధరుఁడు కటాక్షింపంగా శివపంచస్తవి కీతడు వ్యాఖ్యానము రచించెను.
అందు-
శ్లో|| "నాదిండ్ల గోపనృపతే రూరేదేచప్రధానతా
క్వచి దర్ధః క్వచి న్మైత్రీ క్వచి ద్ధర్మ క్వచి ద్యశః