మీఁగడ తఱకలు
103
మ|| శుకముల్ ప్రామినుకుల్ గుణించు గణియించున్ ధర్మమర్మేతిహా
సకథల్ శారిక లీరిక ల్గొను మనీషన్ శేషభాషావిశే
షకళాశాస్త్ర ముపన్యసించు బకముల్ సాత్రాజితీప్రాణనా
యకనామాళి నళుల్ పఠించు సతతోద్యద్గీతికాచాతురిన్
సీ|| నునుగాలిదూదిపానుపు లెన్నియో కాని
యందఱు శయనీకృతాహివరులు
సురలోకవాహిని ర్ఘరము లెన్నియొ కాని
యందఱు దివ్యతీర్ధాంబుపదులు
నీట జనించుమానికము లెన్నియొ కాని
యందఱు కౌస్తుభహారయుతులు
చలివేఁడి వెలుఁగులసాము లెందఱొ కాని
యందఱు నిందుకంజాప్తదృశులు
గీ|| ఖగకులాధీశు లెందఱు కలరొ కాని
యందఱును బుల్గురాటెక్కియములవారు
నారు వోసినరీతి నున్నారు ధీరు
లన్నగరియందుఁ గాపురం బున్నవారు
-ఘటికాచలమాహాత్మ్యము. [1]
ఉద్భటారాధ్య చరిత్రపద్యముల ఛాయ గలపద్యములు పాండురంగ మాహాత్మ్యమునఁగూడ లేకపోలేదు కాని ప్రౌఢతర మయినరచన మగుటచేఁ బాండురంగమాహాత్మ్యమున నీవిధముగాఁ బాడినపాటయే యునఁ దగుపద్యములు గానరావు. ఈ సాధనము లన్నియు రామలింగఁడే రామకృష్ణుఁ డయ్యె ననుసిద్ధాంతమును నిర్వివాదముగా నెలకొల్పఁగల వని నానమ్మకము.
- ↑ ఘటికాచలమాహాత్మ్యము తెనాలిరామకృష్ణకవిరచిత మయినను నది యాతని మనుమనికాలమున (ఆమనుమని పేరు లేదు) ఖండోజిరాయఁడను మహారాష్ట్రునకుఁ గృతి యీయఁబడినది. కాన యందుఁ గృత్యవతరణిక రామకృష్ణుని రచనము గాదు. రామకృష్ణుని విషయ మం దేమియు లేదు. అది కలావతీ ముద్రాక్షరశాలలో 1902 సం|| ముద్రిత మయ్యెను.