పుట:Manooshakti.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక


ప్రస్తుతకాలంబున మన హిందూదేశమునందు మెస్మరిజమను మహాశక్తి నానాటికి క్షీణించుచున్నది. విదేశీయుల మహోన్నతదశను గురించి చదివినప్పుడుగాని వినినప్పుడుగాని మనదేశముగూడ నట్టి గొప్పదశ నెప్పుడు పొందునాయని మిక్కిలి విచారపడవలసి వచ్చుచున్నది. ఇంతియేగాక మనదేశీయులలో నెవ్వరైన నీమెస్మరిజ మభ్యసించిన వారుండిన నితరులను నేర్చుకొనుటకై ప్రోత్సాహము చేయుటకు బదులుగా తామొక్కరే గౌరవమును బొందవలెనని యెంచి తమలో తాము దాచియుంచుకొనుచున్నారు. మరియు కొంతమంది బుద్ధిమంతులు గ్రంధములు వ్రాయ పలువురకు వానియందు నమ్మకములేని హేతువుచే దేశమందెల్లయెడల నల్లుకొనకుండగ యొకరికొక రధైర్యమును వెల్లడించుచున్నారు. తత్కారణమున ప్రతివారికిని మెస్మరిజమునందు మిక్కిలి నమ్మకమును గలుగ జేయుటకై తెలుగుభాషయందు మనోశక్తి యను యీ మెస్మరిజపు గ్రంథమును నాప్రియమిత్రులగు కొత్త సీతారామయ్య మొదలగువారలు మిక్కిలి పట్టుదలతో నాయుద్యమమునకు తోడ్పడిన కారణంబున స్వానుభవముచే రచియించి ముద్రింపించడమైనది.

ఇట్లు

యం. వి. మూర్తిరాజు,

మెస్మరిస్టు.