పుట:MaharshulaCharitraluVol6.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

మహర్షుల చరిత్రలు


నిష్కలుషతను, విద్యావిషయమున శత్రుమిత్రభేదభావ రాహిత్యమును జూపి లోకోత్తరపురుషుఁ డయ్యెను.*[1]

శుక్రాచార్యుఁడు యయాతిని శపించుట

కచుఁడు దేవలోకమున కేగ తన్ననుమతింపు మని కోరఁగా దేవయాని తన్నుఁ బెండ్లాడు మని కోరెను. కచుఁడు ధర్మరహీత మని దాని గంగీకరింపకపోఁగాఁ దనతండ్రివలన గ్రహించిన మృతసంజీవని కచునకుఁ బనిచేయకుండుఁ గాక యని యామె శపించెను. “నా కది పని చేయక పోయినను నావలన గ్రహించినవారికది పనిచేయుఁగాక ! నన్న కారణముగ శపించితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహమాడకుండుఁ గాక ” యని కచుఁడు ప్రతిశాపమిచ్చి వెడలిపోయెను.

వృషపర్వునికూఁతురగుశర్మిష్ఠ తన వేయి మందిచెలికత్తెలతో దేవయానితో వనవిహారమున కేగి యందు దేవయానితో మాట పట్టింపు వచ్చి దేవయానిని బాడునూఁతం ద్రోయించి చెలికత్తెలతో నింటికి వచ్చి చేరెను. యయాతిమహారాజు వేఁటకువచ్చి డస్సి దప్పికచెంది దైవికముగా ఆ నూఁతికడకువచ్చి జలములు తీయ లోనికిఁ జూడ నాతనికి సర్వాంగ సౌందర్యవతి, యువతి యగు దేవయాని పడియుండి కనిపించెను. యయాతి యామెను బలుకరించి యాయమచరిత్ర లడిగి తెలిసికొని తన కుడిచేతితో నామెను బట్టుకొని నూఁతినుండి బయటికిఁదీసి యోదార్చి వేడలిపోయెను. దుర్మార్గురాలై నశర్మిష్ఠఁ గన్న తండ్రినగరము చూడ నని దేవయాని యటనే యుండి తండ్రికి వార్తవం పెను. శుక్రుఁడు వెంటనే కూఁతు రున్న చోటుచేరి యామెవలన జరిగినసంగతి యంతయు విని "తల్లీ !

అనుపమనియమాన్వితులై
అనూనదక్షిణలఁ గ్రతు సహస్రంబులు చే
సినవారికంటె అక్రో
ధనుఁడ కరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్ .
 

  1. *భారతము ఆదిపర్వము.