పుట:Maharshula-Charitralu.firstpart.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

vii




అష్టావక్రస్తుతి

మాతృగర్భమునందె మహిత వేదవ్రాత
             మర సె నెవ్వాఁ డట్టి యురువివేకి
యేకపాదసుజాత లేమహాత్ముని గని
             ధన్యాత్ములై రట్టి తపసిదిట్ట
జనకరాజర్షి యేజ్ఞావిబోధవముచే
             విజ్ఞుఁడై వెలసె నావిబుధవరుఁడు
సద్భ్రహ్మచర్య దీక్షాదక్షుఁడై యెవ్వఁ
             డలఘుకీ ర్తివి గాంచె నామహర్షి

సుప్రభాకాంతపతి యెవ్వఁ డాప్రభావుఁ
డమలవిజ్ఞానమూర్తి గృహస్థ రత్న
మతిపవిత్రుఁ డష్టావక్రుఁ డామహర్షి
కంజలి ఘటించి స్మరియింతు సహరహంబు.

ఋష్యశృంగస్తుతి

సంగత మైనభక్తిని ప్రశంస యొనర్తు "వధీత వేదవే
దాంగువి సర్వసంయమిముఖాబ్జనతంగుని నిర్జితేంద్రియా
నంగుని లిప్తభూతిలపదంగువి సద్గుణసంగునిన్ ప్రభా
భంగువి సంతతోదితతపఃకృతిరంగుని ఋష్యశృంగువిన్..”
                                          (భాస్కరరామాయణము. బాల 92)

కపిలస్తుతి

కపిలమహర్షి రూపమునఁ
            గర్దమమౌనికి దేవహూతియం
దపరిమిత ప్రభావమున
           వర్మలిఁ బుట్టి తరింప వారు సాం
ఖ్యవథము లోకమందుఁ బర
           మాత్ముననుగ్రహపాత్ర మంచుఁ జూ
పి పయిని భక్తి మార్గమును
           బెంపుగఁ జేసినవిష్ణుఁ గొల్చెదన్.