పుట:Maharshula-Charitralu.firstpart.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

దత్తాత్రేయ మహర్షి

దత్తాత్రేయుని జననము

పూర్వము కౌశికుఁడను బ్రాహ్మణుని పత్ని సూర్యోదయ మైనంతనే తన భర్త మరణించు నని యెఱిఁగి సూర్యోదయము కాఁగూడ దని శాసించెను. ఆ మహాపతివ్రత శాసనమున సూర్యుఁ డుదయింప కుండుటచే లోకములు తల్లడిల్లఁజొచ్చెను. దేవత లత్రిమహర్షి భార్యయగు ననసూయను శరణుజొచ్చిరి. అనసూయ కౌశికపత్ని ననునయించి సూర్యోదయ మగునట్లు చేసి దన ప్రాతివ్రత్య మహిమచే నామెభర్తను బ్రదికించి నవయౌవనుని సుందర గాత్రునిఁ జేసెను. దేవత లామె పాతివ్రత్యమునకు మెచ్చి పుష్పవర్షము కురిపించిరి. దేవదుందుభులు మోయించిరి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు "తల్లీ ! నీవలన లోకోపద్రవము తప్పినది. మేము సంతుష్టులమైతిమి. ఏదైన వరము కోరుకొని మామాట చెల్లింపు" మని యనసూయను గోరుకొనిరి ఆమె “మీరు మువ్వురును బరమయోగ్యులైన పుత్త్రులై నాకడుపునఁ బుట్టవలయు” నని కోరుకొనెను. బ్రహ్మ విష్ణుమహేశ్వరు లామెకు వరమిచ్చి యంతర్హితులై రి. పిమ్మట నత్రిమహర్షి పుత్త్రకాంక్షియై చేసిన ఘోరతపమునకుఁ ద్రిమూర్తులును మెచ్చి యా వరమునే యొసఁగిరి, అత్రిమహర్షి వీర్యరూపమున విష్ణ్వంశ మనసూయ గర్భమును బ్రవేశించెను. ఆ యంశముచే సనసూయకు జన్మించిన మహాత్ముఁడే దత్తాత్రేయుఁడు,

దత్తాత్రేయుని ప్రవర్తనము

భూమిపై ధర్మక్షయము కలిగి . మ్లేచ్ఛాచారములు హెచ్చి వర్ణ సంకరము కాఁజొచ్చెను. అప్పుడు జాహ్మణ క్షత్త్రియులు