పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

మహాపురుషుల జీవితములు

వినక కంఠములోనుండి మాటవచ్చువఱ కతఁడు మతబోధ చేయదొడఁగెను. ఆరోగ్యము క్రమక్రమముగ వృద్ధియగుటచే రామకృష్ణ పరమహంస 1886 వ సంవత్సరమున ఆగష్టునెల 16 వ తేదిని రాత్రి యొంటిగంటకు యఖండ సచ్చిదానంద పరబ్రహ్మమును గలసిపోయెను.

ఇతఁడు శరీరమునం దభిమానము లేని మహాయోగి సార్థక నామముగల పరమహంస, నిజమయిన మహర్షి. ధనమును జిల్ల పెంకును సమానముగఁ జూచిన నిస్పృహుఁడు. చండాలుని యందును బ్రాహ్మణునియందును కుక్కయందును గోవునందును ప్రపంచమునందలి సమస్తపదార్థమునందును పరమాత్మ యున్నదని గ్రహించి తత్ప్రకారము నడచిన ఋజువర్తనుఁడు. మతవిషయమున నితనితో భిన్నాభిప్రాయములు గల పురుషుడు సయితము వాని సత్ప్రవర్తనకుఁ గడుంగడు మెచ్చి కొనియాడిరి. బంగాళీభాష దక్క సంస్కృతముగాని మఱియే యితరభాషగాని యతనికి రాకపోయినను దాని బోధనలం జదువునప్పు డతఁడు సకలశాస్త్ర సంపన్నుఁ డనుకొనవలసి వచ్చును. ఈపరమహంస సహజజ్ఞాని యని యనేకుల యభిప్రాయము.