పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణ పరమహంస

ప్రాపంచ భోగములపై నేవగలిగి బాల్యమునందె విరాగులయి యీశ్వరభక్తులయి జీవయాత్ర గడపిన మహాత్ములు పూర్వకాలమునందేగాక యిప్పటికిని హిందూదేశమున నక్కడక్కడ గనఁబడుచున్నారు. స్వామి దయానంద సరస్వతి, మహర్షి దేవేంద్రనాథ టాగూరు, బ్రహ్మానంద కేశవ చంద్రసేనుఁడు, రామకృష్ణ పరమహంస మొదలగు వారందుకు దృష్టాంతములుగ నున్నారు. అందు దయానంద సరస్వతి కొంత ప్రాఁతపద్ధతిని కొంత క్రొత్తపద్దతిని నవలంబించిన మహాత్ముఁడు. దేవేంద్రనాధుఁడును గేశవచంద్ర సేనుఁడును బూర్వ పద్ధతినుండి విడివడి కేవలము క్రొత్తపుంతనే త్రొక్కి జనసామాన్యమున కనిష్టమయిన మతము నవలంబించిన విరాగులు. రామకృష్ణ పరమహంస కేవలము ప్రాచీనమార్గము ననుసరించి పరమభక్తుఁ డయి దేశస్థుల కందఱకు నిష్టుఁడయిన మహాయోగి. ఈతనిచరిత్ర మనేకాద్భుతములతో నిండియుండును. అ యద్భుతములలోఁబెక్కింటి నీకాలపువారు నమ్మఁజాలరు. అయినను పరమ హంసయొక్క శిష్యులలో నగ్రగణ్యుఁడగు వివేకానంద స్వాములవారు వ్రాసిన చరిత్రమునుబట్టి మేము వానిజీవితము నిచ్చట సంగ్రహముగా వ్రాసెదము.

రామకృష్ణ పరమహంస 1833 వ సంవత్సరమున పిబ్రేవరు నెల 20 వ తేదీని బంగాళాదేశమున హుగ్లీ జిల్లాలోని కమర్ప కారనుగ్రామమున జన్మించెను. ఆతనితండ్రిపేరు ఖుదీరామచటోపాధ్యాయులు, తల్లి పేరు చంద్రమణిదేవి. ఆతని తలిదండ్రు లిద్దఱు యోగ్యతకు మిక్కిలి ప్రసిద్ధికెక్కి గ్రామస్థులందరిచేత గౌరవింపఁబడుచు వచ్చిరి. ఖుదీరామచటోపాధ్యాయుల సత్యనిత్యతను దైవభక్తిని దెలుపుటకు రెండుదా