పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

మహాపురుషుల జీవితములు



చుండగానే ట్రెమిలియన్ దొరగారు దక్షిణపు జిల్లాలనుజూడ బయలుదేఱి తంజావూరు జిల్లాలో రామయ్యంగారు చేయుచున్న పని బరీక్షింబగోరి చాల పట్టుదలతో శోధించి యాతడు చేసిన పని మిక్కిలి బాగున్నదని మెచ్చుకొని పోయెను.

1860 వ సంవత్సరమున ప్రెసిడెన్సీ కాలేజీ సంవత్సరోత్సవసమయమున ప్రసగించుచు ట్రెమిలియన్ దొరగారు రామయ్యంగారినీక్రింద విధమున బ్రశంసించిరి. "పై జెప్పిన తరగతిలో జేరిన మఱియొక స్వదేశీయుడగు నుద్యోగస్తుడు తంజావూరుజిల్లాలో మిక్కిలి కష్టమైన పనిని నేర్పులో నెఱవేర్చెను. ఈకార్యసాధనమం దితడుజూపిన సామర్థ్యము, నీతియు నతని కేగాక హిందూజాతి కెల్ల గౌరవముఁ దెచ్చుచున్నది." 1870 వ సం||ర మందు స్వదేశస్థులకుఁ గొప్పయుద్యోగము లియ్యవచ్చునని పార్లమెంటుసభలో నొకచట్టము పుట్టునపుడు యీ దొరగారే రామయ్యంగారి కీ క్రింది విధమున వ్రాసిరి. "హిందువుల కిప్పుడు గొప్ప యుద్యోగము లీయవచ్చునను మంచిస్థితికి వచ్చితిమి. ఇపుడు పార్లమెంటులోనున్న బిల్లు హిందువులుగూడ నింగ్లీషువారితో సమానముగఁ జూడవలయునను న్యాయపద్ధతిమీఁద నిలిచియున్నది. ఇదివఱకు గవర్నమెంటు కొలువులో నుండుటచేతఁ గాని లేక గౌరవమైన స్వతంత్రవృత్తులలో నుండుటచేతఁగాని గొప్ప యుద్యోగములకుఁ దగియున్న స్వదేశస్థులందఱ నట్టియుద్యోగములలో గవర్నమెంటువారు ప్రవేశపెట్టుదురు. ఈసమయమున గవర్నమెంటువారు నిన్నట్టి గొప్ప యుద్యోగములోఁ బ్రవేశపెట్టకపోయిన పక్షమున నాకు విషాదముగ నుండును. నీవు నూరు సంవత్సరములు దొరతనమువారి కొలువుచేసినను తంజావూరులోని కొలుంగు వ్యవహారములవంటి కష్టమయిన వ్యవహారము మరల చేయవలసి యుండదు. నీవు చెన్నపురి రాజధానిలో నున్న స్వదేశస్థులకంటె