పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

మహాపురుషుల జీవితములు



రహితముగాను వర్తింపవలయుననియే యాతని సంకల్పముకాని యితరుల సిఫారసులుచేసి తనవ్యవహారములలోను జోక్యము గలుగ జేసికొనుట యాతని కెంతమాత్రము నిష్టములేదు. ఈయన నిష్పక్షపాతబుద్ధిందెలుపుట కొకచిన్న కథ గలదు. ఒకనాడీయన కోర్టులో నొక వ్యవహారమునం దగులుకొనియున్న యొక మనుష్యుడు రామస్వామి మొదలియారి కెవనియెడమిక్కిలి గౌరవముగలదో యట్టిగొప్ప గృహస్థునివద్దనుండి యొక సిఫారసు జాబుదెచ్చి వ్యాజ్యము తన బక్షము జేయుమని కోరెను. మొదలియారి యామనుష్యుని సగౌరవముగ నాదరించి తనయింటనే బసయిచ్చి తనబండిమీదనే గూర్చుండబెట్టికొని కోర్టునకు దీసికొని పోయెను. ఆగౌరవము నా యాదరణముంజూచి జాబుదెచ్చిన మనుష్యుడు వ్యవహారము తనపక్షముగానే తీర్పు చేయబడునని యది యెప్పుడు విందునాయని యూటలూరు చుండెను. అంతలో మునసబు బెంచి యెక్కి యామనుష్యున కాశాభంగము గలుగునట్లు వ్యతిరేకముగా దీర్పుజెప్పెను. అదివిని యా మనుష్యుడు సిగ్గుపడి రామస్వామి మొదలియారి మొగమైనంజూడక పారిపోయెను. ఇట్లుచేయుటయేగాక మొదలియారి యొకటి రెండు సారులు బెంచి మీదనుండి వ్యవహారములం జిక్కువడినవారు పెద్ద మనుష్యులవద్దనుండి సిఫారసులందెచ్చి న్యాయాధిపతుల మనస్సుల ధర్మమార్గములనుండి త్రిప్ప ప్రయత్నించుట ఘోరమనియు దూష్య మనియు నొక్కి పలికెను. ఈవిధముగా నతడు మంచిగంథములో నొకయడుగు, నగ్నిహోత్రములో నొక యడుగు బెట్టెనను సామెత నిజముగా నెడమప్రక్క కొరుగక కుడిప్రక్కకొరుగక న్యాయమార్గమున ముక్కుకు సూటిగ బోయెను.

ఒకసారి తనకచ్చేరీలో సర్కారుసొమ్ముకొంతపోగా గుమాస్తాలలో నెవరికే ఇబ్బందిరాకుండ దనచేతిసొమ్మిచ్చి యాసొమ్ముబూర్తి