పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[45]

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

353



దుష్పరిపాలనమువలన జెడిపోయి యాదశకువచ్చెనని నిర్భయముగా వ్రాసెను. అందలి విషయము లప్పటి గవర్నరుజనరలగు లిట్టను ప్రభువుకూడ నొప్పుకొనియె. ఈయుత్తర ప్రత్యుత్తరము వలన నింగ్లీషు గవర్న మెంటువారు మైసూరువారి ఋణముమీద కొంతవడ్డీ తగ్గించిరి. అనగా మునుపు సంవత్సరమునకు నూటికైదురూపాయలున్న వడ్డీ నాలుగురూపాయల జేసి ఋణము నలువదియొక్క సంవత్సరములలో దీర్చుకొనుట కంగీకరించిరి. రంగాచార్యుఁడు తెచ్చిన కొత్తపద్ధతులన్నిఁటిలో నుత్కృష్టమైనది జనప్రతినిధిసభ. స్వదేశ సంస్థానములలో నిట్టిసభ యపూర్వము. ఈసభాస్థాపనకీర్తి మన దేశమున రంగాచార్యునకే దక్కెను. ఆతఁడీ సభకు రాజ్యపరిపాలనాధికార మిచ్చుటకుఁ గాక సర్కారువారి యుద్దేశములఁ ప్రజల కెఱిఁగించుట కున్ను సర్కారు చేయఁబోవు చట్టములవారికి ముందుగాఁ దెలుపుటకును రాజునకుఁప్రజలకు నెడ తెగనిసంబంధము గలిగించుటకును రాజుక్షేమమే ప్రజాక్షేమము, ప్రజాక్షేమమే రాజుక్షేమము. ననుమాటలు వారి మనంబున నాటించుటకు నీసభ సృష్టించెను. ఈ సభ క్రొత్తగా బెట్టినప్పుడు దాని ననేకులు గ్రహించి రంగాచార్యులదివఱకు దేశస్థులనేకులకు విరోధియైనందున నెట్లైన వారి యనురాగము బడయుట కీ పనిజేసెనేకాని యది నిలుచునది కాదని జనులు గోలపెట్టిరి. కాని యిప్పటికీ నీసభ సాగుచునేయున్నది. అతఁడింకనూ చాలమార్పులు దెచ్చి దేశమునకు మేలు చేయఁదలఁచెను. కాని 1882 వ సంవత్సరాంతమున జబ్బుపడి చెన్నపురికిఁబోయి యచ్చట మృతినొందెను. అతని నెఱిఁగిన తెల్ల వారు నల్లవారు వాని మరణము మైసూరునకే గాక దేశమున కంతకు నష్టకారియని వగచిరి. బ్రతికియుండగానతని మీఁద నెన్నోయపనిందలుమోపి వేధించిన మైసూరు జనులు తరువాత వాని సుగుణసంపద తెలిసినవారై బిట్టు వగచిరి.