పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

319



వ్రాయగల సామర్థ్యముగలవారు. ముత్తుస్వామియయ్యరు నట్టివాడె. చిన్ననాటనుండియు నితడు చాలకష్టములకోర్చి విద్య నేర్చినవాడు. శాంతసముద్రుడు, నీతిమంతుఁడు ఉపాధ్యాయులందరు వానినెక్కుడు గారము చేయుటంబట్టి విద్యార్థియైన నాతడు కొంచెము గర్వియై యుండెను. గాని యుద్యోగమునందు జేరినపిదప కార్యభారము పై బడినకొలది లోకానుభవము కలిగినకొలది "విద్యయొసగును వినయ" మన్నమాట కుదాహరణమై యుండెను. ఈయనకు సంగీత విద్యయం దత్యంతమైన యభిమానము. ఈనాటి గొప్పయుద్యోగస్థులలో ముఖ్యముగ మన యాంధ్రులలో నిది యరుదుగదా ! ఈయన మహా ధన సంపన్ను డయ్యు దానధర్మములు విస్తారము చేసినట్టు కనబడదు. స్త్రీపునర్వివాహాది సంఘసంస్కారములు తనకిష్టమని పలుమారు వచించియు నాంధ్రదేశ శంకరాచార్యస్వామికిని శ్రీయాత్మూరి లక్ష్మీనరసింహముగారికిని జరిగిన వివాదములో నితఁడు స్వాములవారికి రెండువందల రూపాయలు ధన దండన విధించి యాయన యధికారమును మాత్రము బలపరచెను. ఇందుచేతనే యతడు సంఘసంస్కారమునకు మంచి ప్రాపుకాడని తలంచిరి. సంస్కారాభిలాష యెట్లున్నను దక్షిణ హిందూస్థానములో బుట్టిన గొప్పహిందువులలో నిత డొకడు. ఈయన తన పరిశ్రమవలననే నెలకొక రూపాయిజీతగాడయి యెట్టకేలకు నెలకైదువేల రూపాయల జీతము పుచ్చుకొనువాడయ్యెను. ఈయన సత్ప్రవర్తనము నిష్పక్షపాతబుద్ధి పరిశ్రమాసక్తి శ్లాఘనీయములు.