పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

మహాపురుషుల జీవితములు



లిట్లుండుటచేత నభివృద్ధి పక్షమువారు మన సంఘపద్ధతి వానికాధారమయిన ధర్మశాస్త్రము క్రూరములుగ నున్నవనుట యొకయాశ్చర్యముగాదు. నీతి సంబంధము నాలోచించితిమా బాల వితంతు వివాహములు మన దేశమందెంత యవసరములో కొలఁదికాలము కాపురము చేసిన వింతతువులకు నంతియ యవసరమని నాయభిప్రాయము.

అట్లభిప్రాయపడియు ముత్తుస్వామియయ్యరు హైకోర్టుజడ్జిగా నుండి సంఘసంస్కరణమును ముఖ్యముగా వితంతువివాహమును వృద్ధిజేయుటకు మారు దానికి వ్యతిరేకముగ దీర్పులు చెప్పెను. అట్లు చెప్పుట తగదని కొందఱు తన్ను నిందింప నతఁడీ క్రిందివిధముగా వారికుత్తరము జెప్పెను.

కోర్టులు నడపవలసివచ్చిన హిందూధర్మశాస్త్రము జనుల యంగీకారమును బట్టికాని వేదకాలములోను స్మృతులకాలములోను నుండిన యాచారములనుబట్టి కాదు. అట్లు చేసితిమా తీర్పులు ధర్మ సమేతములుగావు. యుక్తియుక్తములుగావు. ఇట్టిమతము గల్గిన వాఁడయ్యు నతఁడు సంఘపురోభివృద్ధికి విఘ్న కారిగాడని కొందఱభిప్రాయ పడుచున్నారు. ముత్తుస్వామియయ్యరుగారి యభిప్రాయం ప్రకారము ప్రతిమనుష్యునకు మత ముండవలయును. ఆయన పూర్వాచారపరాయణుఁడు. బ్రాహ్మణుఁడు చేయవలసిన నిత్యానుష్ఠానములను తప్పక నెరవేర్చువాఁడు. వేదాధ్యయనము జేసిన వారియెడ నాయనకు మిక్కిలి గౌరవ ముండెను. వేదశాస్త్రముల యభివృద్ధికై యతఁడొక పాఠాశాలగూడ బెట్టించెను. ఆతని జ్ఞాపకశక్తి యద్భుతమైనది. అతఁడు దేనినైన ముమ్మారుచదివిన యావజ్జీవము జ్ఞాపక ముండునట. ఒక వ్యాజ్యము విని తరువాత నాఱుమాసములకైన జ్ఞాపకముంచుకొని తీర్పు వ్రాయఁగలడట. ఆకాలమందలి విద్యార్థులు కొన్ని పుస్తకములను కంఠపాఠముగ జదివి దానిని మరల చూడకుండ